మహబూబ్నగర్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎండాకాలంలో పరిశ్రమలు, వ్యాపార సం స్థల వద్ద జనరేటర్ల మోత వినిపించేది. అప్రకటిత వి ద్యుత్ కోతలతో వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రం గాలు కుదేలయ్యేవి. ఇండ్లల్లో కూడా ఇన్వర్టర్ల మీద ఆధారపడేవారు. విద్యుత్ ఖర్చులు అదనపు భారంగా మారేవి. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియక రైతన్నలు పొలాల వద్ద జాగరణ చేసేవారు. ఏడు గంటల విద్యుత్తో గ్రామాలు అంధకారంలో మగ్గేవి. దీపాలు, క్యాండిల్స్ దిక్కయ్యేవి.. ఇదంతా గతం..
కానీ, స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితులు తా రుమారయ్యాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ సర్కార్ 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుండడంతో వ్యాపార, వాణిజ్య రంగాలు పురోగతిని సాధించాయి. పరిశ్రమలు నిరంతరంగా పనిచేస్తూ ఉత్పత్తిని గణనీయంగా పెంచుకున్నాయి. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ధాన్యగారంగా మారింది. రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయి. జనరేటర్లు, ఇన్వర్టర్లు కనిపించడంలేదు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న విద్యుత్ వినియోగం.. ఇప్పుడు రెండింతలైనట్లు ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. విద్యు త్ సరఫరాలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు 33 కేవీ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు. వ్యవసాయానికి, కమర్షియల్కు నిమిషాల్లోనే ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్, స్తంభాలు మంజూరు చేస్తున్నారు. దీంతో పట్టణాలు, పల్లెల్లో కరెంట్ కోతల మాటే వినిపించడం లేదు. తాగునీరు కూడా ని రంతరాయంగా సరఫరా అవుతున్నది. గ తంలో విద్యుత్ కోతల వల్ల పొలాల వద్ద క రెంట్షాక్ తగిలి ఎం తో మంది రైతులు అ సువులు బాశారు. ఏ డు గంటల విద్యుత్ తో పంటలు ఎండిపోయేవి. ప్రస్తుతం వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారింది. మోటర్లు ఆన్ చేయడానికి రైతులు మొబైల్ యాప్ యూజ్ చేసి మోటర్లు ఆన్, ఆఫ్ చేస్తున్నారంటే పరిస్థితి ఊహించొచ్చు. కోతలు లేని విద్యుత్ వల్ల రైతులు రెండు పంటలను పండిస్తున్నారు. రైతులు డీడీ కడితే వెంటనే ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేస్తున్నారు.
కరెంట్ కోతలే లేవు..
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఉమ్మడి జిల్లాలో వి ద్యుత్ కోతల మాటే వినిపిస్తలేదు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండడంతో అన్ని రం గాలు దూసుకుపోతున్నాయి. భారీ, చిన్నతరహా పరిశ్రమల డిమాండ్కు సరిపడా విద్యుత్ను డిస్కంలు అందిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి పాలనలో 932 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా.. ప్రస్తుతం ఏకంగా 1,490 మెగావాట్లకు పెరిగింది. ఈ ఎనిమిదేండ్లల్లో రూ.120 కోట్లతో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు, రూ.42కోట్లతో 33 కేవీ సబ్స్టేషన్లను 27 చోట్ల ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సెక్టార్కు కూడా అడిగినన్ని ట్రాన్స్ఫార్మర్లు అందజేసి లైన్లు ట్రిప్ కాకుండా చూస్తున్నారు. గతంలో మాదిరిగా సబ్స్టేషన్ల వద్ద ధర్నా, ఖాళీ బిందెలతో రోడ్లపై బైఠాయింపులు కనిపిస్తలేవు. దీంతో విపక్షాలకు కరెంట్మీద ఆందోళన చేసే అవకాశమే లేకుండాపోయింది.
జనరేటర్లు, ఇన్వర్టర్లకు తగ్గిన డిమాండ్..
పట్టణాల్లో వ్యాపార సముదాయాల ఎదుట జనరేటర్లు దర్శనమిచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కోతల్లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అవుతుండడంతో ఎల్ఈడీ లైటింగ్ వెలుతురులో వ్యాపారాలు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద షోరూంలలో కూడా ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. జనరేటర్లు పెడితే ఆ ఖర్చునంతా కస్టమర్ల మీదకే నెట్టేసే పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు అలా లేదని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇండ్లల్లో కూడా ఇన్వర్టర్ల జాడే లేదు. గతంలో కొనుగోలు చేసిన వాళ్లు ప్యాక్ చేసి అటకెక్కించారు. దీంతో జనరేటర్లు, ఇన్వర్టర్లకు డిమాండ్ తగ్గింది.
కరెంట్ అస్సలు పోతలేదు..
కరెంట్ ఎప్పుడు వస్తదో అని ఎదురుచూసే వాళ్లం. ఫ్రిజ్లో కూలింగ్ లేకపోవడంతో ఐస్క్రీంలు, కూల్డ్రింక్స్ చెడిపోయేవి. ఫ్యా న్లు లేక ఉక్కపోతకు ఇబ్బందులు పడేవాళ్లం. జనరేటర్ ఆన్ చేస్తే ఎక్కువ ఖర్చయ్యేది. ఇప్పుడు అస్సలు కరెంట్ పోతలేదు. జనరేటర్ ఆన్ చేసి చాలా రోజులు అవుతుంది.
– రఘు, వ్యాపారి, మహబూబ్నగర్
పాలు, పెరుగు ఖరాబయ్యేవి..
కరెంట్ పోతే ఎప్పుడొస్తుందో తెలియకుండె. దీం తో ఫ్రిజ్లో ఉన్న పాలు, పెరుగు ఖరాబు అవుతుం డె. కూల్డ్రింక్స్, వాటర్బాటిళ్లు, పాల వస్తువులు అన్నీ చెడిపోతుండె.. ఇప్పుడు క రెంట్ పోతదనే బాధేలేదు. లోఓల్టేజీ సమస్య కూడా లేదు. పాలకేంద్రంలో నష్టాలే లేవు. కస్టమర్లకు కావాల్సిన రీతిలో తాజాగా ఉండేలా పాలు అమ్ముకుంటున్నాం.
– నర్సింహులు, పాల వ్యాపారి, మహబూబ్నగర్