అమ్రాబాద్, మార్చి 29 : కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఈడీ, సీబీఐలు అం టూ కేసులు పెడుతున్నదని, వాటికి బీఆర్ఎస్ పార్టీ భయపడదని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. పదర మండలంలోని రాయలగండి ఆలయ ఆవరణలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విప్ గువ్వల మాట్లాడుతూ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. దేశంలో సెక్యులర్ భావాలు ఉ న్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. ప్రతిపక్షాల విష ప్ర చారాలను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించా రు.
రాష్ట్రంలో చేపట్టిన పథకాలు, అభివృద్ధిని ప్రజలకువి వరించాలన్నారు. సామాన్యుడి నడ్డీవిరిచేలా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజావ్యతిరేక బిల్లులను తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. ఆయా రాష్ర్టాల్లో పార్టీలను ఇబ్బందిపెడుతూ అక్రమంగా అధికారాన్ని చేజిక్కిచుకుంటున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని తరిమికొట్టేలా ప్రతి కార్యకర్త కదంతొక్కాలన్నారు. రాష్ట్రం లో, కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అ మలవుతున్న రైతుబంధు, రైతుభీమా, నిరంతర ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ ప థకాలను దేశవ్యాప్తం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించినట్లు తెలిపారు. మోదీ, అదానీ చేతుల నుంచి దే శాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి ప్రతి కార్యకర్త తోడు కావాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచు లు, ఎంపీటీసీలు, సింగిల్విండో డైరెక్టర్లు, వార్డు మెంబ ర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.