కొత్తకోట, ఫిబ్రవరి 19 : నిజాలు వెల్లడిస్తే జీర్ణించుకోలేని స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్కు చెంది న నేతలపై కేసులు బనాయించారు. దేవరకద్ర ని యోజకవర్గంలోని చింతకుంట మండలానికి చెంది న నర్సింహ, కొత్తకోట మండలం పామాపురం గ్రామానికి చెందిన గోవింద్నాయుడును అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కేసుల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి దేవరకద్రకు వంద పడకలు, కొత్తకోటకు 50 పడకల దవాఖానలు మంజూరు చేయాలని అసెంబ్లీలో కోరారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఈ వైద్యశాలలకు నిధులు మంజూరవగా నాటి మంత్రి హరీశ్రావు శంకుస్థాపనలు చేశారు. ఈ ఆధారాలను వాట్సాస్లో పోస్టు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి ఇరువురిపై కేసులు నమోదు చేయించారు.
గోవిందును అరెస్టు చేయడానికి వెళ్లగా.. లేకపోవడంతో ఆయన తల్లి, భార్యను స్టేషన్కు రావాలని హెచ్చరికలు జారీ చేశా రు. దీంతో చేసేది లేక నాయుడు ఆదివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో వచ్చి సంతకం చేసి వెళ్లా డు. ఇక నర్సింహను మాత్రం రోజూ రాత్రిళ్లు పీఎస్లో కూర్చోబెట్టుకొని తెల్లారక ఇంటికి పంపిస్తున్నారు. దీంతోపాటు ఫోన్లల్లో ఆయన్ను అసభ్యకరంగా దుర్భాషలాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తే ఇబ్బందులపాలు చేయడం సరికాదన్నారు.