వనపర్తి, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరులో 60 ఏండ్ల కింద ట ప్రారంభించిన ఉలెన్ ఇండస్ట్రీయల్ కో ఆపరేటివ్ సొసైటీ భవితవ్యం నేడు ప్రశ్నార్థకంగా మా రింది. 1956లో ఏర్పాటైన ఈ సొసైటీ ఉన్నితో నేతను ప్రారంభించి కాలానుగుణంగా నేడు ఉలెన్ బ్లాంకెట్ల తయారీని కొనసాగిస్తున్నది. వందలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న పరిశ్రమకు బీఆర్ఎస్ సర్కారు గురుకులాలు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు అవసరమైన బ్లాంకెట్లను పంపిణీ చేసి చేయూతనిచ్చింది. ఇ ప్పటి వరకు ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిన పరిశ్రమ గత జూన్ నుంచి స్టాక్ నిలిచిపోవడంతో ప్రశ్నార్థకంగా మారింది. ఇలాగే కొనసాగితే సొసైటీ నిర్వహణ, కార్మికులకు వేతనాలు తదితర భారం మరింతపడే అవకాశమున్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభు త్వం చొరవ చూపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అ వసరమున్నది. వెల్టూరులో 1956 సంవత్సరంలోనే ఉలెన్ ఇండస్ట్రీయల్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (డబ్ల్యూఐసీఎస్ఎల్) ఏర్పాటైంది. ఈ సొసైటీలో 200లకు పైగా సభ్యులున్నారు. ఉన్ని కేంద్రం ఏర్పాటైన తర్వాత అనేక మంది కార్మికులకు ఉపాధి లభించింది. చేనేత రంగంలో ఉన్నట్లుగానే ఉన్ని రంగంలోనూ నేత కార్మికులు వేలా ది మంది ఉపాధి పొందుతున్నారు. నాడు గొంగ ళ్లు, కంబళ్లు నేసిన వారే నేడు ఉలెన్ బ్లాంకెట్లను మగ్గాలపై నేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఒక్క వెల్టూరులోనే 100 కుటుంబాల వరకు నేతను నమ్ముకునే జీవనోపాధి పొందుతున్నారు.
కాలానుగుణంగా సొసైటీ రూపాంతరం చెం దుతూ కార్మికులకు ఉపాధిని అందిస్తున్నది. గతేడాదిలో దాదాపు రూ.5 కోట్ల టర్నోవర్ను సా ధించినట్లు సొసైటీ బాధ్యులు చెబుతున్నారు. ఉలెన్ ఉత్పత్తులను మాత్రమే చేపడుతున్న వెల్టూరు సొసైటీ ప్రస్తుతం ఉలెన్ బ్లాంకెట్, కాటన్ బెడ్షీట్స్ రెండు రకాల ఉత్పత్తులను చేపడుతున్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లోని కేజీబీవీలు, ప్రభుత్వ రంగంలో నడిచే గురుకులాలు, మోడల్ పాఠశాలలకు ఇక్కడి నుంచే బ్లాంకెట్స్ను 2017 నుంచి 2021 వరకు పంపిణీ చేపట్టారు. టెస్కో (తెలంగాణ స్టేట్ కోఆపరేటీవ్ సొసైటీ) ద్వారా ఈ సొసైటీ ఉత్పత్తులను అన్ని ప్రభుత్వరంగ సంస్థలకు విక్రయిస్తూ వస్తున్నారు. ఒక్క బ్లాంకెట్కు రూ.100 నుంచి రూ.120 వరకు ఖరీదు చేస్తారు. గతేడాది జూన్లో కూడా టెస్కో ద్వారా 24 వేల బ్లాంకెట్స్తోపాటు ప్రభుత్వరంగ సంస్థలకు విక్రయాలు చేసి దాదాపు రూ.5 కోట్ల టర్నోవర్ చేశారు. ఇంకా సొసైటీ పరిధిలో 60 వేల బ్లాంకెట్లు సిద్ధంగా ఉన్నాయి.
గతంలో గొర్రెల ఉన్నితో గొంగళ్లు, కంబళ్లు (జాడీలు) మగ్గాలపై నేసేవారు. క్రమేనా దక్కెన్ నల్లజాతి గొర్రెలు తగ్గిపోగా, తెల్లని కొండజాతి గొర్రెలు అందుబాటులోకి వచ్చాయి. కొండజాతి గొర్రెలకు ఉన్ని రాదు. దీంతో గొంగళ్లు, కంబళ్ల నేతకు బ్రేక్ పడింది. అనంతరం గొర్రెల ద్వారా తీసిన ఉన్నితో ఉలెన్ బ్లాంకెట్లను తయారు చేసి ప్రభుత్వరంగ సంస్థలకు విక్రయిస్తున్నారు. పదేండ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో సబ్సిడీపై గొర్రెలను అందించడంతో జీవాల సంఖ్య మరింత అధికమైంది. ఇప్పటికే దాదాపు 20లక్షలకుపైగా గొ ర్రెల సంపద ఉన్నది. దీంతో ఉన్నికి ఇబ్బందులు లేకుండాపోయాయి.
20 ఏండ్ల కిందట సొసైటీ ఆధ్వర్యంలో నేత నేయడంలో శిక్షణ తీసుకున్నాం. ఈ పనిలో అన్ని కులాల వారు ఉన్నారు. చాలా మంది ఇక్కడే నేర్చుకొని పనిచేస్తున్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు జీతం తీసుకుంటాం. మాకు భూమి లేదు. ఈ పని అలవాటైపోయి ఇతర పనులు చేయాలనిపించక ఇక్కడే చేస్తున్నాం.
రెండేండ్లుగా నేను, నా భర్త సొసైటీలో పనిచేస్తున్నాం. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 వరకు పని చేసుకుంటున్నాం. సామగ్రి మొత్తం సొసైటీ వారే ఇస్తారు. ఒక్క రోజులో ఒక్కొక్కరు ఎనిమిది బ్లాంకెట్ల వరకు నేస్తారు. ఒక్కో దానిని రూ.120 వరకు విక్రయిస్తారు. మా గ్రామంలో చాలా మంది ఉపాధి పొందుతున్నారు.
ఇక్కడ ఇంట్లో ఉండి పని చేసుకున్నట్లుగానే ఉంటుంది. మాకు సేద్యం లేదు. పదేండ్లుగా ఇదే పని చేస్తున్నాను. మేం తయారు చేసిన సరుకు బయటకు వెళ్తేనే జీతాలు సమయానికి ఇస్తారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ము న్ముందు ఎలా ఉంటదో తెలియదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చిన సర్కారు ప్రోత్సహిస్తే బాగుంటుంది.
ప్రభుత్వ ప్రోత్సాహంతో నే మా సొసైటీ ఇంతకాలం నడిచింది. ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లోని హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీలకు మా సొ సైటీ నుంచి బ్లాంకెట్లు సరఫ రా చేశాం. ప్రస్తుతం ఆర్డర్లు ఇవ్వడం లేదు. ప్రైవేట్ సం స్థల ద్వారా సరఫరా చేయిస్తున్నారు. దీనివల్ల మా వద్ద స్టాక్ మిగిలింది. ఇప్పటి వర కు ప్రతినెలా కార్మికులకు జీతాలు చెల్లిస్తూ వస్తున్నాం. ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలకు మా స్టాక్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై అధికారులను సంప్రదిస్తున్నాం.
సొసైటీలో ప్రస్తుతం 60వేల బ్లాంకెట్లు విక్రయాని కి సిద్ధంగా ఉన్నాయి. కొంతమేర మాత్రమే టెస్కో ద్వారా పంపిణీ చేసినందున స్టాక్ పెద్ద మొత్తంలో మి గిలింది. జూన్లో మాత్రమే కొంత స్టాక్ పంపిణీ చే యగా, తరువాత సరఫరా నిలిచిపోయింది. వేతనాలను ప్రతినెలా సొసైటీ ద్వారా చెల్లిస్తున్నారు. గత 60 ఏండ్లలో 30 ఏండ్లు గొంగళ్లు, కంబళ్లు నేయగా, మరో 30 ఏండ్లుగా సొసైటీలో బ్లాంకెట్ల తయారీని కొనసాగిస్తున్నారు. దాదాపు 200 మంది కార్మికులు సంస్థ లో పనిచేస్తున్నారు. ముడి సరుకులను హర్యానా రా ష్ట్రం నుంచి తెప్పించుకుని బ్లాంకెట్స్ను నేయిస్తున్నా రు. కాగా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎలాం టి ఆటంకాలు లేకుండా సాగిన సొసైటీ నుంచి నేడు ప్రభుత్వపరంగా బ్లాంకెట్ల కొనుగోళ్లు నిలిచిపోయా యి. సొసైటీకి టెస్కో సహకారం యథావిధిగా కొనసాగాల్సి ఉన్నది. సొసైటీ తీసుకున్న రుణం చెల్లించాలన్నా, వేతనాలు ఇవ్వాలన్నా ప్రభుత్వ సహకారం అ వసరమని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.