కౌడిపల్లి, ఆగస్టు 2: గ్రామ దేవతల దయతో పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మతల్లి బోనాల ఊరేగింపు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారా రామాగౌడ్, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రాజునాయక్, సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్, నాయకులు కిశోర్గౌడ్, ప్రవీణ్కుమార్, కాంతారావ్, నాయికోటి రాజు, సందీప్ కుమార్, సంతోష్గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.