చిన్నశంకరంపేట, ఆగస్టు 2: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో కంచలేని ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కంచె లేకపోవడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలంలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంది.
జనసంచారం, వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుదాఘాతానికి గురై కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధితశాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్లకు కంచెలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.