మూసాపేట(అడ్డాకుల), జనవరి 7 : ఆంధ్ర ప్రదేశ్కు చెందిన యువకులు బాలు, వినయ్ హైదరాబాద్లో ఓ పరిశ్రమలో పని చేస్తున్నా రు. అయితే ఇద్దరు కలిసి బైక్పై ఆంధ్రప్రదేశ్లో ని తాడిపర్తికి వెళ్లి సిమెంట్ పరిశ్రమలో మిషన్ ను మరమ్మతు చేసి ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యలో కర్నూల్ వద్ద బైక్లో పెట్రోల్ పోసుకొని బయలు దేరా రు. కొంతదూరం వచ్చిన తర్వాత బైక్ తరచూ ఆగిపోతుండడంతో అడ్డాకుల వరకు వచ్చిన తర్వాత మెకానిక్ కు చూయించారు. బైక్లో ఏం సమస్య ఉందో గుర్తించేందుకు మెకానిక్ పరికరాలు విప్పుతుండగా పాము కనిపించింది.
దీం తో స్థానిక యువకులం తా కలిసి మోటర్ సైకి ల్ ఉన్న పామును బ యటకు తీసేందుకు గంటకు పైగా శతవిధాలుగా ప్రయత్నం చేసి చంపివేశారు. అయితే అది రక్త పింజర అని గుర్తించారు. ఆ పాము కాటు వేస్తే ప్రాణహాని ఉండేదని, యువకులకు ఇంకా భూమి మీ ద నూకలు ఉన్నాయని, అందుకే వారు పాముతోపాటు సుమా రు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించినా వారిని పాము కాటు వేయలేదని అక్కడున్న వారు చర్చించుకున్నారు.