మహబూబ్నగర్/వనపర్తి, జనవరి 10 : దళితుల జీవితాల్లో గిప్పుడే వెలుగులు వస్తున్న సమయంలో ‘మూలుగుతున్న నక్క మీద గుమ్మడికాయ వచ్చి పడ్డ’ చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నదని దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన త ర్వాత రేవంత్ సర్కారు ఈ పథకం బంద్, ఆ పథకం ఇవ్వం అనుకుంటూపోతే మా జీవితాలు ఎలా బాగుపడుతాయని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ ఎదుట మహ్మదాబాద్, గండీడ్ మండలాలకు చెందిన దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారులు బైఠాయించారు. అలా గే వనపర్తి కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల ఐక్యవేదిక ఆ ధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చ ర్ల, పాలమూరు, దేవరకద్ర ఒక్కో నియోజకవర్గానికి 300 మంది చొప్పున 900 మందిని, వనపర్తి జిల్లాలో మొదటి విడుతలో 100 మందిని ఎంపిక చేసి రూ.10 లక్షలు అందించినట్లు తెలిపారు. దీంతో వ్యాపారంతో వారి బతుకుల్లో వెలుగులు ప్రసరించాయన్నారు. రెండో విడుత విషయానికొస్తే పాలమూరు నియోజకవర్గానికి 1,100 చొప్పున అర్హులను ఎంపిక చేశారు. వనపర్తి నియోజకవర్గంలో 1,200 మంది దరఖాస్తు చేసుకున్న ట్లు పేర్కొన్నారు. అయితే ఎన్నికలు సమీపించడంతో త ర్వాత నిధులు సమకూర్చుతామని చెప్పినట్లు వివరించారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. ఇప్పటివరకు పథకంపై రేవంత్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం తో ఎంపికైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే దళితబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకర్ల సూచనల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన విధంగా దరఖాస్తు చేసుకున్నామని, సంబంధిత అధికారుల వద్ద, కలెక్టర్ కార్యాలయంలో లబ్ధిదారుల వివరాలు ఉన్నాయన్నారు. అయి తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం సాయానికి అదనం గా రూ.2 లక్షలు అదనంగా కలిపి రూ.12 లక్షలను అం బేద్కర్ అభయ హస్తం పేరిట దళితులకు ఆర్థిక సాయం చేస్తారని చెప్పినా నేటికీ స్పష్టత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకుంటే కేసీఆర్ సర్కారు అందించిన విధంగా రూ.10 లక్షలు ఇస్తారా..? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మహబూబ్నగర్లో డీఆర్వో రవికుమార్కు, వనపర్తి అదనపు లోకల్ బాడీ కలెక్టర్ సంచిత్ గాంగ్వర్కు వినతి పత్రాలు అందజేశారు. ఆందోళనలో దళిత నాయకులు వెంకటేశ్, పరంజ్యోతి, వెంకట్, శరవంద, సురేశ్, విజయ్కుమార్, ప్రేమ్, రాములు, రవి, దానేలు, శంకర్, లక్ష్మి, అఖిలేందర్, నాగరాజు, మధు, దళిత నాయకులు పాల్గొన్నారు.
నాకు నడవడానికి రాదు. ఎన్నో ఏండ్ల చరిత్రలో ఎ ప్పుడూ లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఎంతో శ్రమించి దళితబంధు పథకం తీసుకొచ్చింది. గిప్పుడు ఆ పథకానికి డబ్బులు ఇవ్వకుండా ప్రస్తుత సర్కారు వ్యవహరించడం సరికాదు. లేకుంటే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుం డా పథకాన్ని అమలు చేయాలి. డబ్బులు వస్తే ఏమైనా పనిచేసుకొని బతుకుతాం అనుకుంటే వచ్చిరాగానే గిట్ల సతాయించడం మంచిదికాదు. గిప్పటికైనా జర్ర ఆలోచన చేయాలె. దళితులకు మంచి చేయాలనే తపనతో ఉంటూ ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి.
దళితులు మంచిగా బతకాలని కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం అమలు చేసింది. గిప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఆ పథకాన్ని ఆపుతామంటే కుదరదు. ఆందోళన చేస్తాం.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతాం.. మాకు న్యాయంగా ఇవ్వాల్సిన పథకం ద్వారా నిధులు ఇవ్వాల్సిందే.. మరో పథకం పెట్టాలని డిమాండ్ చేయడం లేదు. సర్కారు జర ఆలోచన చేయా లె. మేము కొత్తవి అడుగుతలేము. గి ప్పటికైనా సీఎం రేవంత్ నిధులు ఇచ్చి అందర్ని ఆదుకోవాలి.