పాలమూరు, జనవరి 8 : మహబూబ్నగర్ పాలమూరు విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న హరహర ఫంక్షన్హాల్లో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అడిషన ల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడు తూ విద్యార్థులు లక్ష్యం కోసం కష్టపడి చదవాలని, ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఏ రంగంలోకి వెళ్లాలన్న స్పష్టత విద్యార్థులకు ఉండాలని చెప్పారు. ఏ కోర్సు చదవాలో నిర్ణ యం తీసుకుని ఆ అంశానికి సంబంధించిన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించా రు. విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, అందుకు ప్రణాళికాబద్ధంగా చది వి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం డీఈవో రవీందర్ మాట్లాడుతూ ప దో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ముందు నిలిపేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు సమష్టి కృషితో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. అనంతరం వందేమాతం ఫౌండేషన్ వ్యవస్థాపక అ ధ్యక్షుడు రవీందర్ మాట్లాడారు. కార్యక్రమం లో ధర్మాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయు లు కృష్ణయ్య, సీఎంవో బాలుయాదవ్, ఏఎం వో శ్రీనివాస్, గ్రామీణ ఉన్నత పాఠశాలల హె చ్ఎంలు వెంకటేశ్వరమ్మ, ఎండీ.ఖాజా రవీందర్గౌడ్, ఎండీ. రహమాన్ఉష, వెంకటమ్మ, మండల విద్యాశాఖ అధికారి జయశ్రీ, నిపుణు లు టీఎన్.శ్రీధర్, మంజుల, ఫసియోద్దీన్, సుధాకర్, మోహన్రెడ్డి, చక్రవర్తిగౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), జనవరి 8 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ తప్పులు లేకుండా పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆ దేశించారు. అడ్డాకుల మండల ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ఎంట్రీని ఆయన సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం వచ్చిన దరఖాస్తులు ఎన్ని, వాటిలో ఇప్పటి వరకు గ్రామాల వారీగా ఎన్ని ఆన్లైన్ చేశారనే విషయంపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తులను తప్పులు లేకుండా ఆన్లైన్ నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ ఘన్సీరామ్, ఎంపీటీవో మంజుల, ఎంపీవో శ్రీదేవి, డిప్యూ టీ తాసీల్దార్ స్వప్న పాల్గొన్నారు.