మహబూబ్నగర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఎక్కడ బహిష్కరిస్తా రో అన్న భయంతో ముందుగానే రాజీనామా డ్రా మాకు తెరలేపారు కొందరు నాయకులు.. పార్టీ మారేందుకు సిద్ధమై హీరోలు అయిపోదామనుకున్నారు.. కానీ చివరకు జీరోలుగా మిగలడంతో సీన్ రివర్స్ అయింది. దీంతో వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. అయితే తాము వెళ్తే పెద్దమొత్తంలో క్యాడర్ కూడా వస్తుందనుకు న్న వారి వెంట ఒక్క కార్యకర్త కూడా వెళ్లకోవడం తో వారికి భంగపాటు తప్పలేదు. దీంతో వీరి అస లు సిసలు రంగు కూడా బయటపడింది. ఇటీవల జెడ్పీ సమావేశాన్ని అడ్డంపెట్టుకుని ఏదో చేద్దామనుకున్నా ఆ ప్లాన్ కూడా బెడిసికొట్టింది. జెడ్పీటీసీలు అందరూ షాకివ్వడంతో ఖంగుతిన్నారు. రా జీనామా డ్రామాకు తెరలేపిన ఈ ముగ్గురు నే తలు వెంటనే కాంగ్రెస్ నేతలతో బేరసారాలు ఆ డారు. వచ్చి రాగానే టికెట్ ఇవ్వలేం.. అని తిరస్కరించడంతో అయోమయానికి గురయ్యారు. చివరకు పరువుపోతుందని భావించి బీజేపీతో భారీ డీల్కు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. లీడర్లు పార్టీలోకి వస్తున్నారని స్థానిక నేతలు చెప్పడంతో ఆగమేఘాల మీద వనపర్తికి వచ్చిన ఓ రాష్ట్ర బీజేపీ నేత వీరి వాలకం చూసి నోరెళ్లబెట్టారు. ఆయన ముందే టికెట్ నాకంటే నాకు.. కావాలని పట్టుబట్టడంతో.. ఎవరికి కావాలో తేల్చుకుని పా ర్టీలోకి రావాలని చురక అంటించిన వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ద మ్ముంటే పదవులకు రాజీనామాలు చేసి మ ళ్లీ గెలవాలని బీఆర్ఎస్ నేతలు డిమాం డ్ చేస్తున్నారు. కాగా వనపర్తి జిల్లా రాజకీయాల్లో సింగిరెడ్డిని ఢీ కొనలేక పార్టీలన్నీ చతికిలబడిన నేపథ్యంలో ఈ చోటా లీడర్లకు పొ లిటికల్ షెల్టర్ కరువైంది. దీం తో సదరు లీడర్లు ఇటు కాంగ్రె స్, అటు బీజేపీలో చేరేందుకు నానా తంటాలు పడుతున్నా రు. వనపర్తి జిల్లాలో బహిష్కృ త నేతల వాలకం చూసి జనం నవ్వుకుంటున్నారు.
కాంగ్రెస్లో నో ఎంట్రీ.. బీజేపీలో కాస్ట్లీ టికెట్
గులాబీ పార్టీ నుంచి బహిష్కరించిన ఈ ముగ్గురు నేతలకు కాంగ్రెస్, బీజేపీ అడిగి మరీ చేర్చుకుంటాయని అనుకుంటే ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కాంగ్రెస్లో చేరి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్న వీరి ఆశలకు గండి పడింది. రాగానే టికెట్ ఇచ్చేదిలేదు.. అని టీపీసీసీ చీఫ్ తేల్చిచెప్పారు. ఇక బీజేపీలో ఎంట్రీ కాస్ట్లీగా మారింది. పార్టీలో చేరితే మాకేంటి అని అనడంతో ఓ రాష్ట్ర నేతతో బేరసారాలకు దిగారు. పరువు పోతుంది బాబు.. మమల్ని చేర్చుకోండి అని బతిమిలాడారట. దీంతో సదరు రాష్ట్ర నేతతో ఓ భారీ డీలింగ్ కుదిరిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పార్టీలో ఉంటే పరువైన దక్కేది.. పదవులున్నా చేరడానికి ఇన్ని డబ్బులు ఖర్చుపెట్టాలట అని లోలోపల మదన పడుతున్నారని తెలిసింది. ఇటీవల వనపర్తికి వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముందు జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి ఇద్దరు టికెట్ తనకంటే తనకు ఇవ్వాలని భారీ ఆఫర్లు ఇచ్చారట. వీరి వాలకం చూసిన ఆయన ఎవరికి టికెట్ కావాలో తేల్చకోవాలని చెప్పి అసహనంగా వెళ్లిపోయారు.
సొంత పార్టీకే వెన్నుపోటు..
వనపర్తి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంటే సహజంగా కాంట్రాక్టర్లైన ఆ నేతలు ముగ్గురు రాజకీయాన్ని వ్యాపారంగా భావించి పార్టీకి వెన్నుపోటు పొడిచే చర్యలకు పాల్పడ్డారు. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్.. జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో తేరుకోని సదరు నేతలు ఒకరిద్దరితో కలిసి ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో రాజీనామా డ్రామాకు తెరలేపారు. ఇక్కడి సింగిల్విండ్ డైరెక్టర్ సాయిచరణ్రెడ్డి దర్శకత్వంలో డ్రామా సీన్ ఆడి మంత్రికి వ్యతిరేకంగా రాజీనామాలు అని ప్రచారం చేపట్టారు. స్థానిక మీడియాను పిలవకుండా ఎక్కడ నుంచో ఎంగేజ్ చేసిన కొందరు తీసుకొచ్చారు. చివరకు వీరి వెంట పార్టీలోని నాయకులు ఎవరూ వెళ్లకపోవడంతో రాజీనామా డ్రామా అట్టర్ప్లాఫ్ అయింది.
మంత్రి సింగిరెడ్డిని ఢీకొనే సత్తా ఉందా?
వనపర్తి జిల్లాలో హేమాహేమీలదే హవా నడుస్తుంటది. కాంగ్రెస్, టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సహకారంతో 70 ఏండ్లు చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేండ్లలో చేసి చూపించారు. చిన్న జిల్లాలు ఏర్పాటవుతున్న తరుణంలో వనపర్తిని జిల్లాగా మార్చి తన సత్తా చాటారు. మంత్రిగా ఉంటూ జిల్లా కేంద్రంలో వేల కోట్లతో ప్రగతి పనులను చేపట్టారు. రాష్ట్రంలోనే అత్యధిక ఎత్తిపోతల పథకాలను సాధించిన ఘనతతో బీడు భూ ములకు సాగునీరు అందించారు. చిన్నచిన్న చెరువులను రిజ ర్వాయర్గా ఏర్పాటు చేసి ఎండాకాలంలో కూడా నీళ్లు నిల్వచేసుకునే స్థాయి వరకు తీసుకొచ్చారు. కొత్త కలెక్టరేట్, ఎస్పీ కా ర్యాలయ భవనాలను కట్టించి జిల్లా కేంద్రం రూపునే మార్చారు. మెడికల్ కాలేజీ, మత్స్య, ఇంజినీరింగ్, వ్యవసాయ, నర్సింగ్ కళాశాలలను తీసుకొచ్చి ఎడ్యుకేషన్ హబ్గా మార్చారు. జిల్లాకేంద్రం చుట్టూ ఉన్న చెరువుల స్థాయిని పెంచి మినీ ట్యాంకుబండ్లుగా మార్చి ఏడాది పొడవునా కృష్ణా జలాలు ఉండేలా తీర్చిదిద్దారు. వనపర్తిలో రహదారులను విస్తరించి పట్టణ భవిష్యత్ చిత్రపటాన్నే మార్చారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇక మంత్రికి సరిలేమని డిసైడ్ అయి నియెజకవర్గంపై ఆశలు వదులుకున్నారు. నిరంజన్రెడ్డి దాటికి జిల్లెల చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు.
జెడ్పీ సమావేశంలో చుక్కెదురు
వనపర్తి జెడ్పీ సమావేశాన్ని తమకు అనుకులంగా వాడుకోవాలని చూసి బహిష్కృత ముగ్గురికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖంగుతినిపించారు. సమావేశానికి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, ఎంపీపీలు కిచ్చారెడ్డి, మేఘారెడ్డి మాత్రమే హజరయ్యారు. కాంగ్రెస్కు చెందిన ఏకైక జెడ్పీటీసీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కోరం లేకపోవడంతో జెడ్పీ సీఈవో సమావేశాన్ని వాయిదా వేశారు. ఊహించని పరిణామానికి ఈ ముగ్గురు నేతలు ఖంగుతిన్నారు. 12 మంది బీఆర్ఎస్ జెడ్పీటీసీలు ఏకతాటిపై నిలబడి ముగ్గురు నేతలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీకి ద్రోహం చేసి ఏ ముఖం పెట్టుకుని జనంలో తిరుగుతున్నారని మండిపడ్డారు.
రాజీనామాలు చేయాలి
నెత్తిమీద రూపాయి పెడి తే చారానకు అమ్ముడుపోని సద రు ముగ్గురు నేతలు దమ్ముంటే త మ పదవులకు రాజీనామాలు చేసి మ ళ్లీ గెలిచి చూపించాలి. రాజకీయాల్లో ఓ నమాలు తెలియని వీరికి మంత్రి నిరంజన్రెడ్డి పెద్దమనుసుతో పదువులు కట్టబెడి తే పదవులు అనుభవిస్తూ పార్టీకే ద్రో హం చేస్తున్నారు. జెడ్పీటీసీకి ఎక్కువ. ఎంపీటీసీకి తక్కువ అయిన ఈ చెల్లని నాణేల పనిని వనపర్తి ప్రజలే నిర్ణయిస్తారు. వారి గోతిని వారే తవ్వుకున్నారని అర్థమవుతుంది. తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిన వారికి కార్యకర్తలే బుద్ధి చెబుతారు.
– గట్టుయాదవ్, బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు