గద్వాల, ఫిబ్రవరి 1 : మిర్చి పంట రైతు కంట్లో కారం కొట్టిం ది. పంటకు ఆకుముడత తెగులు సోకడం.. కాలం కలిసి రాకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు లాభాలు ఆర్జించారు. దీంతో ఈసారి కూడా కోటి ఆశలతో మిర్చి సాగు చేశారు. గత వానకాలంలో గద్వాల, అలంపూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పంట వే శారు. రైతులకు ప్రకృతి కనికరించకపోవడం తో దిగుబడి లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వేసిన పంటకు తెగుళ్ల పీడ అంటుకోవడంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిం ది. మంచి దిగుబడితో లాభాలు వస్తాయని ఆశించిన రైతుల కు అప్పు లే మిగలడం ఖాయమని వాపోతున్నారు. నడిగడ్డ భూములు మిర్చి సాగుకు అనుకూలం. దీంతో 2023 ఏడాదిలో మిర్చి పంటను ఎక్కువగా సాగు చేశారు. రైతులకు పెట్టుబడి పోను ప్రతి ఏడాది ఎకరాకు రూ.50వేలపైనే ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పండిన మిర్చి అమ్మినా పెట్టుబడికి సరిపోయే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేసిన మిర్చి పంటకు ఆకు ముడత పురుగు సోకడంతో పైరు ఎదగకపోవడంతోపాటు దిగుబడి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
రైతులు సాగు చేసిన మిర్చిపంటలకు ఆకుముడత పురుగు సోకడంతో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో ఎకరాకు సుమారు 20 క్వింటాళ్ల వరకు మిర్చిని రైతులు పండించే వారు. అయితే ప్రస్తుతం మిరపకు చీడపీడలు సోకడంతో దిగుబడి కాస్తా 8నుంచి 10క్వింటాళ్లకు పడిపోయింది. 2022లో రైతులు ఎకరాకు 20క్వింటాళ్ల పంట దిగుబడి రావడంతోపా టు ధర కూడా ఎక్కువగా ఉండడంతో రైతులు మంచి లాభా లు అర్జించారు. 2022 గుంటూరు మిర్చి క్వింటాకు రూ.10 వేల నుంచి రూ.14వేల వరకు, బాడి రకం రూ.15వేల నుంచి రూ.50వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం దిగుబడి లేకపోవడం ధరలు కూడా రూ.20వేల నుంచి రూ.25వేల లోపు ఉండడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. దీంతో ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని భూములు మిర్చి సాగుకు అనుకూలంగా ఉండడంతో రైతులు ఈ పంటపై ఎక్కువగా ఆ సక్తి చూపుతారు. జిల్లాలో అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని మల్దకల్ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా మిర్చి పంట ను సాగు చేస్తారు. ఏడాదికి ఏడాది మిర్చి సాగు జిల్లాలో పెరుగుతున్నా రైతులకు మాత్రం అనుకున్న స్థాయిలో లాభాలు రా వడం లేదు. 2020లో జిల్లాలో 24,388 ఎకరాలు, 2021 లో 35,085వేల ఎకరాలు, 2022లో36,757 ఎకరాల మి ర్చిపంట సాగు చేశారు. అయితే 2022లో మిర్చి సాగు చేసిన రైతులు మంచి లాభాలు ఆర్జించడంతో 2023లో రైతులు ఒకేసారి 65,115 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. అయితే, పంట సాగు చేసిన సమయంలో తెగులు సోకడం, అనుకున్న స్థాయి లో ధరలు లేకపోవడంతోపాటు దిగుబడి తగ్గడంతో పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనే ఆలోచనలో రైతులు ఉన్నారు. ప్రభుత్వపరంగా చేయూతనిచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మిరపపంటకు 2022లో ధర బాగుందని 2023లో ఆరు ఎకరాల మిరపసాగు చేశాను. ఎకరా సాగు కౌలు కలుపుకొంటే సుమారు రూ.2 లక్షల దాకా పెట్టుబడి పె ట్టాను. గతేడాది గుంటూరు రకానికి రూ.20వేల పైన ధర ఉండేది. ప్రస్తుతం రూ.15వేలు దాటడం లేదు. ఎకరాకు 20 క్వింటాళ్లపైనే దిగుబడి వస్తుండేది ప్రస్తు తం ఆ పరిస్థితి లేదు. బాగడ క్వింటా రూ. 50వేల వరకు ధర పలికింది. ఈ ఏ డాది రూ.20వేలు దాటడం లేదు. దీంతో తీవ్ర నష్టాల ఊబీలో కూరుకుపోయాం. ప్రభుత్వమే మిర్చి రైతులను ఆదుకోవాలి.
రైతులు సాగు చేసిన మిర్చి పం టకు తామర పురుగు, గజ్జిమడతలు తెగుళ్లు ఎక్కువగా ఆశించడంతో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. గతేడాదితో పోల్చితే మిరపసాగు పెరిగినప్పటికీ దిగుబడి లేదు, ధరలు బా గా తగ్గిపోయాయి. దీంతో పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదోనని ఆందోళనలో ఉన్నాం. ధర పెరుగుతుందని చాలా మంది రైతులు మిర్చిని పంట పొలాల్లో ఆర బెట్టుకుంటున్నాం. ధర పెరిగితే రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.