కొల్లాపూర్, అక్టోబర్ 25 : అసెంబ్లీ ఎన్నికలను అధికారులు పకడ్బందీగా ముందస్తు చర్యలను చేపట్టారు. నియోజకవర్గంలో మొత్తం 269 పోలింగ్ కేంద్రాలుండగా ఇం దులో 51 గ్రామాల్లో 121 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన ట్లు రెవెన్యూ, పోలీస్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికా రి, జిల్లా అదనపు కలెక్టర్కుమార్దీపక్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదికను పం పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికశాతం ఓట్లు పోలైన పోలింగ్ కేం ద్రాలను సైతం అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా పో లైన కేంద్రాల్లో పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల పోలింగ్ కేంద్రం నంబర్ 1లో, మరికల్ పోలింగ్ కేంద్రం 12 లోనూ, మ హాసముద్రం పీఎస్ నంబర్ 38లో, పాన్గల్ మండలం కిష్టాపూర్ పీఎస్ నంబర్ 103లో 90శాతం అత్యధికంగా ఓట్లు పోలైనట్లు గుర్తించారు. పెద్దకొత్తపల్లి మండలం లో మొత్తం 9 సమస్యాత్మక పోలింగ్ కేం ద్రాలుగా గుర్తించగా, వీటిలో వెన్నచర్ల1, చంద్రకల్లో2, మరికల్లో 1, దేవునితిర్మలాపూర్లో 1, జొన్నలబొగుడలో 2, మహాసముద్రంలో 1, సాతాపూర్లో 4, మారెడుమాన్దిన్నెలో 2, కల్వకోలులో 5 పోలింగ్కేంద్రాలను గుర్తించారు. కోడేరు మండలం లో నాలుగు గ్రామాలకు గానూ 9 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని గు ర్తించారు. ఇందులో నార్యానాయక్తండా లో 1, ఎత్తంలో 3, కొండ్రావుపల్లిలో 2, న ర్సాయపల్లిలో 3 పోలింగ్ కేంద్రాలున్నాయి.
పాన్గల్ మండలంలో రేమొద్దులలో 4, గోప్లాపూర్లో 2, కిష్టాపూర్లో 1, అన్నారంలో 2, మహ్మదాపూర్లో 2, పాన్గల్లో 4,తెల్లరాళ్లపల్లిలో 2, చిక్కేపల్లిలో 2, బండలపల్లిలో 1, రాయిన్పల్లిలో 1, బుసిరెడ్డిపల్లిలో 2, కేతేపల్లిలో 3 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. వీపనగండ్ల మండలంలో బొల్లారం లో 2, వల్లభాపూర్లో 1, కల్వరాలలో నా లుగు, పుల్గర్చర్లలో 2, తూంకుంటలో 3, సంగినేనిపల్లిలో 3, గోవర్ధన్గిరిలో 2, వీపనగండ్లలో 5 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు గుర్తించారు. అలాగే చిన్నంబావి మండలం లో వెలుగొండలో 2, దగడపల్లిలో 3, పెద్దదగడలో 3, లక్ష్మిపల్లిలో 1, చెల్లెపాడ్లో 1, కొప్పునూర్లో 4, చిన్నమారూర్లో 1, పె ద్దమారూర్లో 3 సమస్యాత్మక పోలింగ్ కేం ద్రాలుగా గుర్తించారు. పెంట్లవెల్లి మండలం మొత్తంలో కొండూరులోని 2 పోలింగ్ కేం ద్రాలు, కొల్లాపూర్ మండలంలో కుడికిళ్లలో 4, చింతలపల్లి, ఎన్మన్బెట్ల, చౌటబట్ల, మొ లచింతపల్లి, నర్సింహాపురంలో ఒక్కొక్కటి చొప్పున, చుక్కాయపల్లిలో 2, కొల్లాపూర్ పట్టణంలో 11, ఎల్లూరులో మూడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల అధికారులు గుర్తించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపారు. ఇంతే కాకుండా గతంలో జరిగిన అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సం దర్భంగా రాజకీయ ఘర్షణల మూలంగా ఏ ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో చోటు చేసుకున్నాయో ఆయా కేసులకు సంబంధించిన క్రైం నెంబర్లు, సెక్షన్లతో సహా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల అధికారులు నివేదికను పంపినట్లు రెవిన్యూ వర్గాలు తెలిపాయి.
చిన్నంబావి, అక్టోబర్ 25 : అసెంబ్లీ ఎ న్నికల్లో భాగంగా ఎన్నికల కోడ్ను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామనిఎస్సై కృష్ణ ఓబుల్రెడ్డి అన్నారు. బుధవారం ఆ యన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నడుచుకోవాలన్నారు. పార్టీల సమావేశాలకు, ప్రచార రథాలకు త ప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ను తూచ తప్పకుండా పాటించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా మండల నాయకులు, ప్రజలు పోలీస్శాఖ, ఎన్నికలశాఖ అ ధికారులకు సహకరించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్య లు తీసుకుంటామని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు, ఇతర వస్తువుల సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు గురువారం చిన్నంబావిలో కేం ద్ర బలగాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వా హనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భం గా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తు పంపిస్తున్నారు. ఎవరైన మద్యం, డబ్బు అ క్రమంగా తరలిస్తే వారిపై చర్యలు ఉంటాయని, రూ.50వేల లోపు డబ్బుకు ఎలాం టి అనుమతి అవసరం లేదని, రూ.50వేల కంటే ఎక్కువ ఉంటే సంబంధిత రసీదులను చూపించాలని ఎస్సై సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.