అమరచింత, జూలై 7 : కలుషిత ఆహారం తిని 37 మంది విద్యార్థినులు అస్వస్థతకు గు రైన ఘటన మండలంలోని పామిరెడ్డిపల్లి శివారులో గల కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విద్యాలయంలో మొత్తం 220 మంది విద్యార్థినులు ఉండగా, గురువా రం రాత్రి కలుషిత ఆహారం తిని శుక్రవారం ఉదయం 37మంది విద్యార్థినులతో పాటు ఇద్ద రు ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు హుటహుటిన ప్రైవేట్ వాహనాల్లో ఆత్మకూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు సాయిశ్రీ, మౌ నిక, స్పందన, శ్రవంతి, అక్షర, అఖిల, పూజిత, శశికళ మరో ఇద్దరుతోపాటు మొత్తం పదిమంది విద్యార్థులకు కడుపులో నొప్పి అధికంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా దవాఖానకు తరలించారు. విద్యార్థినులు రాత్రి తిన్న ఆహారం కలుషితం కావడంతో అస్వస్థతకు గురయ్యారని డాక్టర్ అక్షయ్కుమార్ తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యంపై కలెక్టర్ ఆరా..
వనపర్తి, జూలై 7 : కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురై వనపర్తి దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవా ర్ పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఎస్వో, డీఈవోకు షోకాజ్ నోటీసులు..
కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురై ఘటనలో విధుల్లో నిర్లక్ష్యానికి గాను ఎస్వో స్వప్నారాణిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు కలెక్టర్ నందలాల్ తెలిపారు. అలాగే కో-ఆర్డినేటర్ శుభలక్ష్మి, డీఈవో గోవిందరాజులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇద్దరు వంట మనుషులను సైతం విధుల నుంచి తప్పించారు. ఏఎస్డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న సేవ్యానాయక్ శుక్రవారం కార్యాలయానికి తాగి వచ్చినందుకు సస్పెండ్ చే స్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిపారు.
విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే
విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి వెంటనే మండల, జిల్లా అధికారులను అప్రమత్తం చేసి ఆత్మకూర్ ప్రభుత్వ దవాఖానకు వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. ఆందోళన చెందవద్దని సూచించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. గంటపాటు దవాఖానలోనే ఉండి విద్యార్థులు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వనపర్తి జిల్లా అధికారులతో కలిసి కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. పరిశుభ్రత పాటించకపోవడం, కాలం చెల్లిన వంటసామగ్రి, కూరగాయలు సరిగా లేకపోవడం ఎమ్మెల్యే గమనించారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాలలో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రూ.5లక్షల నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రికార్డులను పరిశీలించి పలువురు హాజరుకాకపోవడంపై విచారణ చే పట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చే శారు. ఏవైనా సమస్యలు ఉంటే నే రుగా తనకు ఫోన్ చేయాలని ఎమ్మె ల్యే ఫోన్నెంబర్ ఇచ్చారు. పాఠశాలలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చే యించారు. విద్యార్థులకు ఎటువం టి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల కు సూచించారు. ఎమ్మెల్యే వెంట స ర్పంచ్ పావని, జెడ్పీటీసీ సరోజ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వై ద్యాధికారులు శ్రీనివాసులు తదిత రులు ఉన్నారు.