వనపర్తి, సెప్టెంబర్ 13 : వనపర్తి ని యోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మ రింత పటిష్టం చేసేందుకు కార్యకర్తలం తా కలిసికట్టుగా పనిచేయాలని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో రేవల్లి, పెబ్బే రు, శ్రీరంగాపూర్ మండలాల్లోని తాటిపాముల, తిప్పాయిపల్లి, కంబాళాపురం, నాగరాల, జానంపేట, అయ్యవారిపల్లి, శాగాపూర్, రాంపురం, రామమ్మపేట్, బూడిదపాడు, మూనిగమానుదిన్నె గ్రా మాలకు చెందిన 250 మంది కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు బుధవారం మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సం క్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు స్వ చ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో అం దరూ భాగస్వాములు కావాలని, మీ అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో రైతులు, ప్రజలు వలసలు వెళ్లేవారని, పదేండ్లల్లో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్లోకి తీసుకురావడంతో నేడు ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. రైతన్న కండ్లల్లో ఆనందం కనబడుతున్నదన్నా రు.
పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వె లుగులు నింపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు. దేశంలో ఎక్కడాలేని పథకాలను ప్రవేశపెట్టడంతో తెలంగాణ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా పేదల అభివృద్ధే ఎజెండాగా ఉంటుందన్నారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని పెద్ద మునగల్చేడ్, కన్మనూర్ గ్రామాలకు చెందిన ఆరుగురికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ దా మోదర్రెడ్డి, పెద్ద మునగల్చెడ్ ఎంపీటీసీ రాంచంద్రయ్యసాగర్, గణేశ్, నా యకులు భీంరెడ్డి, శ్రీధర్, నరసింహ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.