నవాబ్పేట, అక్టోబర్ 28 : రాష్ట్రంలో మరింత అభివృద్ధికి కారు, సారు గెలవాల్సిందేనని బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఫత్తేపూర్ మైసమ్మ ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేసి.. అమ్మవారికి ఎమ్మెల్యే మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రుద్రారం గ్రామం నుంచి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారాన్ని ప్రారంభించి.. కొం డాపూర్, హజిలాపూర్, రాంసింగ్తండా, వీర్శెట్టిపల్లి గ్రామాల్లో పర్యటించారు. అడుగడుగునా ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం మండలకేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి, ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే క ర్ణాటకలో పట్టిన గతే పడుతుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకుల వాగ్ధానాలకు మోసపోయి అధికారమిస్తే.. రైతులకు కేవలం 3 గంటల కరెంటు మాత్రమే ఇస్తుందన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఎరువులు, విత్తనాలకు లైన్లలో నిలబడాల్సిన దుస్థితి వస్తుందన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ లక్ష్మారెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని కో రారు. అనంతరం దాయపంతులపల్లిలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు తిరుపతయ్య, సిద్దోటం సర్పంచ్ వసుంధర కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, వైస్ చైర్మన్ చందర్నాయక్, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, ముడా డైరెక్ట ర్ చెన్నయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, సర్పంచులు గో పాల్గౌడ్, లలితమ్మ, బొజ్జమ్మ, నర్సింహానాయక్, గంగమ్మ, ఎంపీటీసీలు గోపాల్, గోపీకృష్ణ, నాయకులు శీనయ్య, స్వరూప, రాంప్రసాద్, శ్రీను, లక్ష్మి, నాగిరెడ్డి, అ బ్దుల్లా, నవనీతరావు, లక్ష్మయ్య, కృష్ణగౌడ్, వెంకటేశ్, అబ్దుల్అలీ తదితరులున్నారు.