నార్నూర్, జూలై 10: హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. పలె ్లప్రగతి ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో, జిల్లా పరిషత్ ఆవరణలో డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లేతో కలిసి 100కు పైగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్పీచైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి బాట పడుతున్నాయని తెలిపారు. వాతావరణంలో సమత్యులత రావాలంటే అడవులు విస్తృతంగా పెరగాలన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించేందుకు మొక్కలు నాటాలని కోరారు. తాడిహత్నూర్లోని జిల్లా పరిషత్ పాఠశాల మరమ్మతుకు రూ.5లక్షలు మంజూరు చేశారు. అలాగే లింక్ సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనాథ్, ఎంపీడీవో రమేశ్, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్, వైస్ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ ఫడ్ విష్ణు, బెతల్గూడ సర్పంచ్ జాదవ్ సుజాత పరమేశ్వర్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్, సహకార సంఘం డైరెక్టర్ కాంతారావ్దుర్గే, షెడ్యూల్ క్యాస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్దుర్గే, ఆలయ కమిటీ చైర్మన్ విశాల్, టీఆర్ఎస్ నాయకులు మహాదావ్ కెంద్రే, జాదవ్ బాబు, మెస్రం మానిక్రావ్, మోతే రాజన్న, రాథోడ్ శ్రావణ్, రాథోడ్ గణేశ్, జాదవ్ రోహిదాశ్, రాథోడ్ హరి, దావుల రమేశ్, ధన్లాల్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనులు పరిశీలన
నార్నూర్, జూలై10: గాదిగూడ మండలం లోకారి(కే), సావ్రీ, అర్జుని, పర్సువాడ(కే) గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను జడ్పీ సీఈవో గణపతి పరిశీలించారు. పంచాయతీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. గ్రామాల్లో నిర్వహించిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం, మురుగు కాలువలు, పరిసరాలు శుభ్రంగా ఉన్నాయని ప్రశంసించారు. మిగిలి పనులు ఉంటే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో రామేశ్వర్, ఎంపీవో సాయిప్రసాద్, జడ్పీటీసీ మెస్రం గంగుబాయిసోము, సర్పంచ్ మోతుబాయి, మడావి కాను, రాహుల్, పంచాయతీ కార్యదర్శులు రవి, సునీల్, టీఆర్ఎస్ నాయకుడు భగ్వంత్రావ్కాంబ్లే ఉన్నారు.
పనులు పూర్తి చేయాలి
నార్నూర్, జూలై 10: పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలని డివిజన్ పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ సిబ్బందికి సూచించారు. మండలంలోని మహాగావ్, కంపూర్ గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో స్వప్నశీల, సర్పంచ్లు రాథోడ్ యశ్వంత్రావ్, ఆనంద్రావ్, పంచాయతీ కార్యదర్శులు నరేశ్, కాశీరాం ఉన్నారు.
గ్రామాలకు కొత్త శోభ
బేల, జూలై 10: పల్లె ప్రగతితో మారుమూల గ్రామాలకు కొత్త శోభ వచ్చిందని ఎంపీడీవో రవీందర్ కుమార్ అన్నారు. మండల కేంద్రంతో పాటు చప్రాల, చంద్పల్లి గ్రామాల్లో పారిశుధ్య పనులు, హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అలాగే సాంగిడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎస్ఐ సాయన్న, మణియార్పూర్ సర్పంచ్ వాడ్కర్ తేజ్రావు, సాంగిడి ఎంపీటీసీ రాకేశ్ మొక్కలు నాటారు. డోప్టాల గ్రామంలో శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఇంద్రశేఖర్, దౌలత్ పటేల్, రాకేశ్, నాయకులు కన్నల గంగన్న, మహేందర్, యువజన సంఘాల నాయకులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
హరితహారంతో గ్రామాల్లో పచ్చదనం
బోథ్, జూలై 10: హరితహారంలో నాటిన మొక్కలతో గ్రామాల్లో పచ్చదనం పరుచుకుంటున్నదని ఎంపీపీ తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా సొనాల, సాంగ్వి, పొచ్చెర గ్రామాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో సీహెచ్ రాధ, ప్రత్యేకాధికారి శ్రీధర్స్వామి, సర్పంచ్ మల్లేశ్, జగదీశ్, అశోక్రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
భీంపూర్, జూలై 10: అంతర్గాం, కరంజి(టీ), భీంపూర్ గ్రామాల్లో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సర్పంచ్లు బక్కి లలిత, జీ స్వాతిక, మడావి లింబాజీ ,పెండెపు కృష్ణ ఇంటింటికీ తిరిగి మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నితిన్, సందీప్, సాయినందన , నాయకులు జీ నరేందర్, రాథోడ్ ఉత్తమ్, బక్కన్న, నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
నాటిన మొక్కలను సంరక్షించాలి
తలమడుగు, జూలై 10: హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ జాడే అన్నారు. మండల కేంద్రంలోని సబ్ స్టేషన్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అలాగే మండల కేంద్రంలోని పీహెచ్సీలో వైద్య సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, విద్యుత్ శాఖ ఏఈ సతీశ్, మండల వైద్యాధికారి రాహుల్, ఎంపీవో దిలీప్, ఎంపీటీసీ చంటి, ఉపసర్పంచ్ సత్యపాల్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కల్యాణం రాజేశ్వర్, వెంకటి పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూలై 10: లక్కారం గ్రామంలో సర్పంచ్ రాథోడ్ జనార్దన్ ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటారు. సుద్దగూడ, నవోదయ నగర్, ఐటీడీఏ నుంచి చెక్పోస్టు కొత్తగూడెం వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కరాడి ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి జగదీశ్, కారోబార్ రవీందర్రెడ్డి, కూలీలు పాల్గొన్నారు.
కన్నాపూర్లో..
ఉట్నూర్ రూరల్, జూలై 10: కన్నాపూర్ గ్రామంలో సర్పంచ్ పెందూర్ జుగాదిరావు ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నైతం ధైర్యవంతి, బీట్ అధికారి అనిల్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి
నేరడిగొండ, జూలై 10: పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జడ్పీటీసీ జాదవ్ అనిల్ పిలుపునిచ్చారు. మండలంలోని సావర్గాం గ్రామంలో ఎంపీపీ రాథోడ్ సజన్తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ కళ్యాణి, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, నాయకులు మహేందర్, ఉపసర్పంచ్ పాల్గొన్నారు.
మొక్కలు పంపిణీ
తాంసి, జూలై 10: మండల కేంద్రంతో పాటు బండలనాగాపూర్, వడ్డాడి, గిరిగాం, సవర్గాం, జామిడి, అంబుగాం, ఘోట్కూరి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ తిరుగుతూ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు కృష్ణ, వెంకన్న, కేశవ్రెడ్డి, శ్రీనివాస్, గజానన్, యశ్వంత్, భరత్, పంచాయతీ కార్యదర్శులు గంగన్న, హమిద్, తదితరులు పాల్గొన్నారు.