మహబూబ్నగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నిక లు ఏవైనా గెలుపు అధికార పార్టీదే’ అని మరోసారి రుజువైంది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. రెండు స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నది. నామినేషన్ల ఉపసంహరణకు మరోరోజు గడువు ఉండగానే.. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారికి సమాచారం ఇచ్చారు. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రతిపక్షాల నుంచి కనీసం పోటీ కూడా లేకపోవడం చూస్తే అధికార పార్టీ స్థాయి ఏంటో స్పష్టమవుతున్నది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు అత్యధికులు టీఆర్ఎస్కు చెందిన వారే కావడంతో ప్రతిపక్షాలు పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. పోటీ చేద్దామని ప్రయత్నించిన స్వతంత్రులు సైతం నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
కారు ఖాతాలో రెండు ఎమ్మెల్సీలు..
స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. మొత్తం 10 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. ఆరుగురి నామినేషన్లు చెల్లుబా టు కాలేదు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఇండిపెండెంట్లు పో టీలో ఉన్నారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా.. కోడేరు మండలానికి చెందిన సుధాకర్రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. గురువారం మరో స్వతంత్ర అభ్యర్థి ఫరూఖ్నగర్ మండలం ఎలికట్టకు చెం దిన ఎంపీటీసీ శ్రీశైలం కూడా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా లేఖ అందజేశారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోడంతో అధికార పార్టీ అ భ్యర్థుల గెలుపు ఖాయమైంది. షెడ్యూల్డ్ ప్రకారం శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో నియమిత గడువు ప్రకారం మధ్యాహ్నం 3 గం టల తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. వారికి ఎన్నికల రిటర్నింగ్ అ ధికారి, మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు ధ్రువీకరణ పత్రాలు అందచేయనున్నారు. ఏకగ్రీవం కావడంతో టీఆర్ఎస్ నాయకుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎ మ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఐదుగురు జెడ్పీ చైర్పర్సన్లు, 90 శా తానికి పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా అధికార పార్టీ వారే. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థలకు సంబంధిం చి రెండు ఎమ్మెల్సీ స్థానాలను అధికార పార్టీ కై వసం చేసుకోవడంతో పార్టీకి ఉ న్న ఆదరణ కు గుర్తుగా భావించొచ్చు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూచకుళ్ల దామోదర్రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం హైదరాబాద్లోని బీకేఆర్ భవన్లో కృతజ్ఞతలు తెలిపారు.