మక్తల్,అక్టోబర్ 8: తెలంగాణా రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో నియోజకవర్గాలు అభివృద్ధి బాట పట్టాయి. గతంలో అరకొర నిధులతో అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న మక్తల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సీఎం కేసీఆర్ సహకా రంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లపుడు అందు బాటులో ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. చాలా గ్రామాలకు బీటీ రోడ్లు, అంతర్గత రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగు పరిచారు. మున్సిపాల్టి కేంద్రాలో పా ర్కులు ఏర్పాటు చేసి పచ్చదనం పరిశుభ్రత ,ఆహాల్లాదకర వాతావర్ణం కల్పించారు. ప్రతి మండల కేంద్రంలో విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరిచారు.
నియోజకవర్గ కేంద్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రస్తుతం ఉన్న 33 పడకల దవాఖాన ఏమాత్రం సరిపోక రోగులు ఇబ్బం దులు పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సీఎం కేసీఆర్ సహకారంతో 150 పడకల దవాఖానను మంజూరీ చేయించారు. ఇటీవల రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు చేతుల మీదుగా పట్టణ శివారులో దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేయించారు. అలాగే కృష్ణ మండల కేంద్రంలో పీహెచ్సీ ఆరోగ్య కేంద్రంలో 30 పడకల దవాఖాన ఏర్పాటు చేయడానికి భవన నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే పల్లె దావాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి డాక్టర్లను, వైద్య సిబ్బందిని నియమించారు. మక్తల్ పట్టణంలో రూ.కోటీ 50 లక్షల వ్యయంతో సమీకృత మార్కెట్ను ఏర్పాటు చేశా రు. వ్యవసాయ మార్కెట్కు నూతనంగా రూ.70 లక్షల వ్యయంతో కార్యాలయ భవనాలను నిర్మించారు. మండలంలో రైతులు తా ము పండించిన దాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి రుద్రసముద్రం గ్రామంలో నిర్మించిన రెండు వేర్హౌజ్ గిడ్డంగులను ఇటీవల మంత్రి హరీశ్రావు చేతు మీదుగా ప్రారంభించారు.
నియోజకవర్గంలో మక్తల్, మాగనూర్, ఉట్కూర్, అమరచింత, కృష్ణ, ఆత్మకూర్ మండల కేంద్రాల్లో కస్తూర్భా గాంధీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యా అవకాశాలను మెరుగు పరిచారు. కృష్ణలో రూ.3.5 కోట్ల వ్యయంతో కస్తూర్భా గాంధీ పాఠశాల నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి. అమరచింత మున్సిపాల్టీ పరిధిలో రూ.2 కోట్ల రూపాయల వ్య యంతో కేజీబీవీ పాఠశాల భవనాలను పూర్తి చేశారు. అలాగే ఇటీవ రూ.2.30 కోట్ల వ్యయంతో అదనపు గదులను మంజూరు చేయించారు. ప్రస్తుతం పనులు పురోతి లో ఉన్నాయి. అమరచింత మున్సిపాల్టి కేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లను నిర్మించారు. నియోజకవర్గంలో మక్తల్, ఉట్కూర్, మాగనూర్,కృష్ణ మండల కేంధ్రాలో కస్తూర్బాగాంధీ, మక్తల్లో మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారు.
ఊట్కూర్ మండలంలో పగిడిమారి నుంచి ఊ ట్కూ ర్కు బీటీ రోడ్డు నిర్మించారు. అలాగే నిడుగుర్తి, లక్ష్మిపల్లి, తిప్రాస్పల్లి నుంచి ఓబ్లాపూర్ వరకు ,తిమ్మారెడ్డి తాండ, పెద్దజట్రం, చిన్నజట్రం, మక్తల్-నారాయణపేట ఆర్అండ్బీ రోడ్డు నుంచి చిన్నపొర్ల, పెద్దపొర్ల వరకు బీటీ రోడ్లు వేశారు. మక్తల్ మండలంలో జక్లేర్ ఆర్అండ్బీ రోడ్డు నుంచి 5.6 కోట్ల వ్యయంతో సామన్పల్లి, నుంచి కాట్రేవ్పల్లి వరకు బీటీ రోడ్డు నిర్మించారు. మాగనూర్ మండలంలో గురావ్లింగంపల్లి, తాళంకేరీ, కొత్తపల్లి, వడ్వా ట్, కృష్ణ మండలంలో ముడుమాల, గుడేబళ్లూర్, చేగుంట గ్రామాలకు బీటీ రోడ్లు వేయడంతో రవాణ వ్యవస్థ మెరుగు పడింది. దీంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.