మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 3 : ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టులను నమ్మితే తర్వాత గోసపడుతామని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. 11వ వార్డు పరిధిలోని పాతపాలమూరు, బాలాజీనగర్, 23వ వార్డు పరిధిలోని శివశక్తినగర్, మేకలబండలో రోడ్షో నిర్వహించారు. మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. పాతపాలమూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే రెండు పర్యాయాలు ఎంతో కష్టపడి మహబూబ్నగర్ అభివృద్ది చేసిన మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ మరో లక్ష మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పి.చంద్రశేఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం పాతపాలమూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి పాల్గొన్నారు. తన బాల్యమంతా పాతపాలమూరులోనే సాగిందని, ఇక్కడి ప్రజల కష్ట సుఖాలన్నీ తెలుసన్నారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ జీవించారని, గతంలో కనీసం తాగునీరు, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో పేదలకు డబుల్డ్రూం ఇండ్లు ఇచ్చామన్నారు. ఒక్క పాతపాలమూరులోనే రూ.12. 14కోట్ల ఆసరా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ది చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు జాతరలో వెలిసే అంగడిలాంటి వారని, ఓట్ల జాతర అయిపోగానే ఆ దుకాణాలను ఎత్తేస్తారన్నారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే శ్రీనివాస్గౌడ్ను గెలిపించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, సింగిల్విండో చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాసులు, తిరుపతమ్మ, నాయకులు నవకాంత్, మాల్యాద్రిరెడ్డి, వెంకటేశ్గౌడ్, వాజిద్, హాజీ తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ, నవంబర్ 3 : కాంగ్రెస్, బీజేపీ మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండలంలోని షేక్పల్లి, అయోధ్యనగర్, అత్యకుంట తండా, ఎల్లబాయితండాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మంత్రి ప్రచారం సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు, కార్యకర్తలు డప్పచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఎల్లబాయితండాలో ఎద్దులబండి ఎక్కి ర్యాలీ చేపట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అడగకుండానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. పదేండ్లలోనే పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని, మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రైతుబంధు, దళితబంధు, బీసీ బంధుతో అన్నివర్గాల ప్రజలకు అండగా నిలిచారన్నారు. మీ తండాలో మీరే అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను మరోసారి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, రామణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, వైస్ ఎంపీపీ లక్ష్మి, సర్పంచులు శ్రీదేవి, సుగుణ, సక్రిబాయి, పగిలమ్మ, సింగిల్ విండో వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, ఎంపీటీసీ వడ్లశేఖర్, నాయకులు లక్ష్మయ్య, జంబులయ్య, బాలయ్య, యాదయ్య, నరేందర్, హరిచందర్, చెన్నయ్య, రాఘవులు, సత్యం తదితరులు పాల్గొన్నారు.