నాగర్కర్నూల్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి 30వ తేదీ వరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్య, పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్యశాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోనున్నాయి. ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో వందశాతం లక్ష్యం దిశగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పరీక్షలకు స న్నద్ధం చేశారు.
విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు తొలిమెట్టు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యాశాఖ స హా వైద్య, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనున్నది. ప్రతి కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు, జిరాక్స్ కేంద్రాలను మూసివేసేలా ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నా పత్రాలను తెరవనున్నారు. మాస్ కాపీయింగ్కు పాల్పడితే సంబంధిత సీఎస్, డీవోలపై చర్యలు తీసుకోనున్నారు.
ఇక పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్ సహా ఎలక్ట్రానిక్ పరికరాలను తీ సుకెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలకు ని మిషం నిబంధన అమలులో లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎండాకాలం దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీటి వసతి, విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా చూడాలని సంబంధిత శాఖకు సూచించారు. వైద్య సిబ్బంది కూ డా కేంద్రాల వద్ద అందుబాటులో ఉండనున్నారు. గ్రా మాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బ స్సులను నడపనున్నది.
విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లతోపాటు పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లు, సి ట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, అ ధికారుల నియామకాన్ని పూర్తి చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టరాదని అధికారులు ఆదేశించారు. ఈసారి సైన్స్ పరీక్షల్లో రెండు పేపర్లు ఉండనున్నాయి. గతంలో భౌతిక, జీవశాస్ర్తాలు ఒకే పేపర్గా నిర్వహిస్తుండగా ఈ సారి ఫిజిక్స్ పరీక్ష మార్చి 26న, బయాలజీ పరీక్ష 28న నిర్వహించనున్నారు. ఈ విషయమై విద్యార్థులకు ఇదివరకే అవగాహన కల్పించారు.
పదో తరగతి పరీక్షలు సీసీ కెమెరాల నిఘా నీడలో కొనసాగనున్నాయి. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా ప్రశ్నాపత్రాన్ని ఓపెన్ చేయ డం, ప్యాకింగ్ చేయడం వంటి కార్యక్రమాలన్నీ కూ డా సీసీ కెమెరాల నిఘా నీడలో జరుగనున్నది. ప్రతి విద్యా ర్థి తప్పనిసరిగా వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలి, ఏవైనా ఫిర్యాదులు ఉంటే సమాచారం కోసం టోల్ఫ్రీ నెంబర్ 08545233525కు సంప్రదించాలని వనపర్తి ఇన్చార్జి డీఈవో గోవిందరాజులు సూచించారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులను విద్యాశాఖ కల్పిస్తుంది. పరీక్షల సమయంలో విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అలాగే పోలీస్, విద్యుత్, తపాల శాఖలు పరీక్షల నిర్వహణలో భాగస్వాములు కానున్నాయి.
విద్యార్థులు ఇలా చేయాలి..
పది ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా చర్యలు తీసుకుంటు న్నాం. వెనుకబడిన వి ద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాం. సైన్స్లో ఈ సా రి రెండు పేపర్లు ఉండ డం వల్ల గతంలో పడిన ఇబ్బందులు ఈసారి తలెత్తవు. ఈ విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించాం. విద్యార్థులు అల్పాహారం తెచ్చుకొని ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలి.
– శ్రీలత, జీహెచ్ఎం, జెడ్పీహైస్కూల్, నాగర్కర్నూల్