వాషింగ్టన్, ఆగస్టు 11 : అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్పై నమోదైన క్రిమినల్ అభియోగాలను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. కేసుపై విచారణను శాశ్వతంగా నిలిపివేస్తూ జడ్జి నికోలస్ గారౌఫిస్ అభియోగాలను రద్దు చేశారు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, వినీత్ జైన్లపై ఉన్న సెక్యూరిటీస్ మోసపు కుట్ర ఆరోపణలను కూడా కోర్టు కొట్టివేసింది.
‘విత్ ప్రిజుడీస్’ కింద కేసును కొట్టివేయటం వల్ల భవిష్యత్తులో నిర్దిష్ట ఆరోపణలపై మళ్లీ విచారణ చేపట్టడానికి వీలుండదు. ఇక ఈ కేసులోని మొదటి, ఐదవ అభియోగాలపై జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. కేసు కొట్టివేత ప్రాసిక్యూటర్ విచక్షణ మేరకు తీసుకున్నదే తప్ప, ఆరోపణలపై ఇచ్చిన తీర్పుగా భావించరాదని న్యాయమూర్తి కోర్టు ఉత్తర్వులో ప్రత్యేకంగా పేర్కొన్నారు.