నాగర్కర్నూల్, డిసెంబర్ 28 : నాగర్కర్నూల్ బస్టాండ్లో నిలిపి ఉన్న కారు అద్దం పగలగొట్టి రూ.లక్ష యాభైవేలను ఎత్తుకెళ్లిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధితుడు శంకర్ తెలిపిన వివరాల ప్రకారం .. బిజినపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామానికి చెందిన చిదిరే శంకర్ గురువారం జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్డులోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.లక్షాయాభైవేలను డ్రా చేసుకున్నాడు.
డబ్బులను కారులో హ్యాండ్బ్రేక్ వద్ద పెట్టుకొని బస్టాండ్లోని కారును ఆర్టీసీ పారింగ్ పకన నిలిపి టీ తాగడానికి వెళ్లారు. గుర్తుతెలియని దుండగులు డ్రైవర్ వైపు గల అద్దాన్ని పగలగొట్టి కారులోని నగదును ఎత్తుకెళ్లారు. ఐదు నిమిషాల్లో కారు వద్దకు చేరుకున్న బాధితులు చోరీ జరిగిన విషయం గమనించి బాధితుడు ఆర్టీసీ అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చుట్టుపక్కల సీసీ పుటేజీలను పరిశీలించి విచారణ చేపట్టారు.