గోపాల్పేట, ఏప్రిల్ 9 : యాసంగిలో సాగు చేసి న వరి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎటుచూసినా చెరువు లు, కుంటలు, కాల్వలు వట్టిపోయాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు తగ్గాయి. దీంతో ఎండుతున్న పంటలకు నీళ్లు అందించేందు కు రైతులు ట్యాంకర్లతో నీటిని పారించుకునే పరిస్థితి దాపురించింది. పంట చేతికొచ్చే దశలో నెర్రెలుబారిన పొలాలు, ఎండుముఖం పట్టిన పంటను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు వేసినా ఫలితం లేకపోయింది.
పెట్టుబడి అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. చేసేదేమీలే క ఎండిన పంటను జీవాలకు మేతగా వదిలేస్తున్నా రు. గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లో చెరువులు, కుంటలు, బోరుబావుల కింద యాసంగిలో 15,363 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారుల అంచనా. మున్ననూర్లో 660 ఎకరాల్లో వరి సా గు చేయగా పంట చేతికొచ్చే దశలో ఉన్నది. కేఎల్ఐ, ఎంజీకేఎల్ఐ కాల్వ, చెరువులు, కుంటలు వ ట్టిపోవడంతో కొద్దిపాటి బోర్లు, ట్యాంకర్ల ద్వారా పంటకు చాలీచాలని నీళ్లు అందిస్తున్నారు. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోరు కింద నాలుగున్నర ఎకరా ల్లో వరి పంట వేశాను. రూ.లక్షకుపైగా పెట్టుబడి అయ్యింది. పంట చేతికొచ్చే దశలో బోరు నుంచి నీళ్లు తక్కువగా వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక ట్యాంకర్ ద్వారా పంటకు నీళ్లు పెడుతున్నా. ఒక్కో ట్యాంకర్కు సుమారు రూ.400 ఖర్చు అవుతున్న ది. సమీపంలోని రైతుల బోర్ల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నాను. దీంతోపాటు పక్క రైతుల బోర్ల నుంచి నా పొలం వరకు పైపులైన్ వేశాను. పైపు ల కోసం రూ.50 వేల వరకు ఖర్చు చేశా. చాలీచాలని నీటితో ఎండిన పొ లం పారాలంటే కష్టంగా ఉన్నది. పం టను కాపాడుకునేందుకు నానా యాతన పడుతున్నాను. రెండు ఎకరాలన్నా బయటపడుతుందేమో అనే ఆశతో పంటకు నీళ్లు పెడుతున్నా.
– రమేశ్, రైతు, మున్ననూర్, గోపాల్పేట మండలం
యాసంగిలో బోరు కింద రెండెకరాల్లో వరి నాటిన. ఎండలు ఎక్కు వై బోర్ల నీళ్లు తక్కువైన వి. పంటను కాపాడుకునేందుకు మరో బోరు వేయించిన. అది కూడా సన్నగా నీళ్లు పోస్తుంది. అవి దేనికీ సరిపోవడం లేదు. ఇంతవరకు కేఎల్ఐ కాల్వ నీళ్లు పుష్కలం గా వస్తుండే. బోర్లు కూడా బాగా పోస్తుండే. భూమిల నీళ్లు లేక బోర్లు తగ్గినై. ఏసిన పంట చేతికొచ్చేటట్లు లేదు. నోటికాడికి వచ్చిన పంట ఎండిపోతుంటే నిద్ర పడ్తలేదు. పంట పెట్టుబ డి, చేసిన కష్టం మీద పడేటట్లు ఉంది. సర్కారు పంట నష్టాన్ని గుర్తించి రైతులను ఆదుకోవాలి.
– గోకారి ఉద్దాలు, రైతు, మున్ననూర్
కేఎల్ఐ కాల్వ నీళ్లు వస్తున్నప్పుడు ఇన్ని క ష్టాలు లేకుండే. మూడు బోర్ల కింద రెండెకరా ల్లో వరి, రెండెకరాల్లో కూరగాయలు సాగు చేశా. బోర్లలో నీళ్లు తగ్గిపంటలకు తడి సరిపోవ డం లేదు. కాల్వ నీళ్లు రాకపోగా, ఉన్న బోర్లలో నీళ్లు తగ్గిపోయి నిరాశే మిగిలింది. వరి ఎండుముఖం పట్టింది. కూరగాయల పంటకు నీళ్లు సాలక ఇప్పటికే ఎకరా వదిలిపెట్టిన. ఇంతవరకు ఇట్ల ఎప్పుడూ జరుగలే. బోర్ల నీళ్లు సాలకుంటే కాల్వల నీళ్లు పుష్కలంగా ఉంటుండే. పంట నష్ట పరిహారం అంది స్తే మాకు మేలు జరుగుతుంది.
– అడ్డాకుల వెంకటయ్య, రైతు, మున్ననూర్