నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 23 : మహిళలు పౌష్టికాహారం తీసుకొని రక్తహీనత బారిన పడకుండా ఆరోగ్యా న్ని కాపాడుకోవాలని జిలా ్లపరిషత్ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప ట్టణ శివారులోని స్కిల్ సెంటర్లో నిర్వహించిన పోషకాహార ఉత్సవాల కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల గర్భిణులు రక్తహీనత బారిన పడుతున్నారని పేర్కొన్నారు. తద్వారా ప్రసవ సమయంలో సమస్యలు రావడం, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా లేకపోవడం, సరైన ఎదుగుదల లేకపోవడం వంటి రుగ్మతలకు దారి తీ స్తుందన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల నుంచి అం దించే పాలు, గుడ్లు, పోషకాలతో కూడిన భోజనాన్ని తీసుకోవాలన్నారు. కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ సరైన పో షక నిల్వలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల కీళ్ల నొ ప్పులు, మోకాళ్ల నొప్పులు ఇతరత్ర అనారోగ్యాలకు గురవుతుంటారన్నారు. జిల్లాలో చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, దీనిని అధిగమించడానికి మన చుట్టూ ఉండే ఆకుకూరలు, మునగ, ఉసిరి, జొన్నలు, సజ్జలు ఇతర చిరుధాన్యా లు తినాలని కలెక్టర్ చెప్పారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో వారానికి ఒకసారి చిరుధాన్యాలు ఆహారం ఇచ్చేందుకు ప్రణాళికలు చే స్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ చైర్పర్స న్ గందె అనసూయ మాట్లాడుతూ ప్రతి మ హిళ పౌష్టికాహారం తీసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. ప్రముఖ న్యూట్రీషన్ శ్రీదేవి మాట్లాడుతూ చిరుధాన్యాల్లో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయి, వాటితో ఎలాంటి వంటకాలు చేసుకోవచ్చో వివరించారు. అనంతరం చిన్నారులకు జెడ్పీ చైర్పర్సన్, కలెక్ట ర్ అన్నప్రాసం చేయించారు. కొంతమంది గర్భిణులకు సా మూహిక సీమంతం చేశారు. కార్యక్రమంలో మహిళా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సీడీపీవోలు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.