నాంపల్లి కోర్టులు, మే 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్పై మరోసారి వాదనలు వినిపించాలని ఇన్చార్జి కోర్టుగా కొనసాగుతున్న 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 7వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయని, తీర్పును వెల్లడించాలని నిందితుడి తరఫు న్యాయవాది కోరినప్పటికీ వాదనల కోసం వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.
బీఆర్ఎస్ సోషల్ మీడియాకు క్రిశాంక్ పాత్ర చాలా ముఖ్యమని, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. మరోసారి వాదనల విన్న తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తుందని కోర్టు తెలిపింది. ఎన్నికల సమయంలో క్రిశాంక్ బయటికి రాకుండా చేసేందుకే ప్రభుత్వం యోచిస్త్తున్నదని నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టు బయట ఆగ్రహం వ్యక్తం చేశారు.