పెబ్బేరు, సెప్టెంబర్ 21 : ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య ఉత్సవం నెలకొన్నదని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం పెబ్బేరులో మత్స్య కాలేజీ బాలుర వసతి గృహం, భోజన శా లను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడు తూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య రంగానికి ఊపి రి పోసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి అద్భుత అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. గతంలో మత్స్య పరిశ్రమ అంటే కేవలం కోస్తాంధ్రకే పరిమితం అన్నట్లుగా ఉండేదని, ఆ విధానాన్ని రాష్ట్ర సర్కారు మార్చేసిందన్నారు. రాష్ట్రంలో వరంగల్, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో మత్స్య కళాశాలల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారని తెలిపారు. మత్స్య కళాశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. మత్స్య సంపదకు నిలయంగా రాష్ట్రం మారిందని చె ప్పారు. సమాఖ్య పాలనలో మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదని, నేడు ప్రభుత్వం తీసుకున్న చ ర్యలతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని తెలిపారు. నిండుకుండను తలపించే దిగువ మ హాభూపాల్ సముద్ర జలాశయం చెంతన మత్స్య కళాశాల నిర్మించడం శుభసూచికమని అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం:మంత్రి నిరంజన్రెడ్డి
రాబోయే రోజుల్లో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడి మత్స్య కాలేజీలో చేరేందు కు ఆసక్తి చూపే విధంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. మత్స్య కాలేజీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో మ త్స్య సంపద ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం ఖాయమన్నారు. ఈ కళాశాల్లో విద్యను అభ్యసించిన విద్యార్థుల జ్ఞాన సంపద భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమన్నారు. కళాశాలను అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అదనం గా రూ.25 కోట్ల నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నా రు. విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఇక్కడే పీజీ తరగతుల నిర్వహణకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. కా ర్యక్రమంలో పీవీ నరసింహారావు వర్సిటీ ఉపకులపతి రవీందర్రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మత్స్య క ళాశాల ప్రిన్సిపాల్ కిషన్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్యామల, ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, విండో చైర్మన్ కోదండరాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చారెడ్డి, కౌన్సిలర్ సుమతి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.