అయిజ, మే 2 : ప్రజలకిచ్చిన 420 హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఎమ్మె ల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి విమర్శించారు. గడిచిన నాలుగు నెలల్లో ఒక్కటి మినహా మిగతా వాటిని గా లికొదిలేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టిందన్నా రు. గురువారం పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో అ యిజ పట్టణ, మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి స మావేశంలో మాట్లాడారు. ప్రజలను నమ్మించి మో సం చేసిన కాంగ్రెస్ను ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వర కు 4ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రైతుబంధు వేసి మిగతా రైతుల పొట్టకొడుతున్నదన్నారు.
కేసీఆర్ హ యాంలో రైతుబంధు, రైతుబీమా, రుణమాఫి పారదర్శకంగా జరిగిందన్నారు. అబద్ధాలు ప్రచారం చేసి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నా రు. అయిజ పెద్దవాగుపై నిర్మిస్తున్న హై లెవల్ వం తెన పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు వినతిపత్రం అంద జేశారు. నెల రోజుల్లోనే పూర్తి చేసేలా అధికారులతో మాట్లాడినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలపర్చిన నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే విజయుడు పిలుపునిచ్చారు.
పదేళ్ల కేసీఆర్ హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. సీఎం రే వంత్రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే పని పెట్టుకున్నారన్నారు. పది రోజులపాటు బీఆర్ఎస్ శ్రేణులు ఇం టింటికీ తిరిగి ఆర్ఎస్పీని భారీ మెజార్టీతో గెలిపిం చి పార్లమెంట్కు పంపాలన్నారు. సమావేశంలో ప్ర జాప్రతినిధులు, శ్రేణులు పాల్గొన్నారు.