చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
చొప్పదండి, ఏప్రిల్ 23: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు ఆపన్నహస్తంలా మారిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు రూ.4.62లక్షల విలువైన సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. గతంలో సీఎం రిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకున్నవారు సాయం అందక నానా అవస్థలు ఎదుర్కొనేవారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పారు. నిరుపేదలు నిశ్చింతగా కార్పొరేట్ దవాఖాన్లలో చికిత్స చేసుకుని సీఎం రిలీఫ్ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందుతున్నారని తెలిపారు. అర్హులు రిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
పంచాయతీ కార్యదర్శిపై పోస్ట్మాన్ దాడి
ఒలింపిక్స్ కు ముందు వైరస్ ఎమర్జెన్సీ ప్రకటించిన జపాన్