టోక్యో : ఒలింపిక్స్ కు మూడు నెలల ముందు జపాన్ వైరస్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇతర దేశాలతో పోలిస్తే జపాన్ లో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నా ఒలింపిక్స్ కు ముందు తాజాగా కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలతో ఆందోళన నెలకొంది. టోక్యో, క్యోటో, ఒసాకా, హ్యోగో ప్రాంతాల్లో వైరస్ ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకున్నామని జపాన్ ప్రధాని యషిదె సుగ శుక్రవారం ప్రకటించారు.
వైరస్ ఎమర్జెన్సీ ఏప్రిల్ 25 నుంచి మే 11 వరకూ అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకుంటే కఠిన నియంత్రణలు విధిస్తామని జపాన్ మంత్రి యసుతొషి నిషిముర్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు థియేటర్లు, షాపింగ్ మాల్స్ ను మూసివేయాలని అధికారులు సూచిస్తున్నారు.