కట్టంగూర్, మే 15 : గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక గ్రంథాలయంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సంర్భంగా ఆమె మాట్లాడుతూ పుస్తక పఠనం మనిషి ఆలోచన విధానాన్ని మార్చి వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతుందన్నారు. యువత, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని, రోజువారీగా పూర్తిక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి చదువు ఎంతో చదువు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంబటి అంజయ్య, గ్రంథపాలకురాలు తారకేశ్వరి, పంచాయితీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, ఏకుల సుజాత, పులకరం శ్రీను, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పద్మావతి, ఉపాధ్యాయులు ఆంథోని, మహమ్మద్ అబ్దుల్ గపూర్ పాల్గొన్నారు.