కట్టంగూర్, మే 15 : మహిళ సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు,స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మించనున్న (స్త్రీ శక్తి) మహిళ సంఘాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ సంఘాల బలోపేతానికి ఈ భవనాలు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, సంఘ బంధం అధ్యక్షురాలు దొరెపల్లి వద్ద వార్డు సభ్యులు ఏనుగు సైదులు, ఏకుల సుజాత, శ్రీరామ సంధ్య పాల్గొన్నారు.