ఆసిఫాబాద్ టౌన్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 90 మందికి పోలీసులు రూ. 16 వేలు జరిమానాగా విధించారు. కొందరికి రూ. 100.. మరికొందరికి రూ.200 చొప్పున ఫైన్ వేశారు. కరోనా వైరస్ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పోలీసులు, పంచాయతీ సిబ్బంది ఈ సందర్భంగా సూచించారు.