బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి ముత్యంపల్లి పీహెచ్సీ ప్రారంభం
కాసిపేట/బెల్లంపల్లిరూరల్, మే 27 : గ్రామీణ ప్రాంతాల ప్రజలకూ మెరుగైన వైద్య సేవలు అం దించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అ న్నారు. మండలకేంద్రంలోని ముత్యంపల్లిలో డీఎంఎఫ్టీ నిధులు రూ.1.15 కోట్లతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. పీహెచ్సీ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఇందుకోసం మండలాల్లో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. కరోనా సోకిన వారు బయటకు వెళ్లకుండా ఐసొలేషన్లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మీకు ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రహెమాన్, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రం రావు, జిల్లా కొవిడ్ వైద్యాధికారి బాలాజీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణారెడి,వైద్యాధికారి కిరణ్మూమై, ఎంపీటీసీ కొంబత్తుల రాంచందర్, అక్కెపల్లి బుగ్గ రాజు, చంద్రమౌళి, సహకార సంఘం చైర్మన్ నీలా రాంచందర్, సర్పంచ్లు ఆడె బాదు, దేవి, ఉప సర్పంచ్లు పిట్టల సుమన్, బోయిని తి రుపతి, కోఆప్షన్ సభ్యుడు సిరాజ్ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులారెడ్డి పాల్గొన్నారు.