దండేపల్లి, మే 24 : దండేపల్లి పీహెచ్సీని మండల ప్రత్యేకాధికారి జాదవ్ ప్రకాశ్ సోమవారం సందర్శించారు. జిల్లాలోని పీహెచ్సీల పర్యవేక్షణకు కలెక్టర్ భారతీ హోళికేరి ప్రత్యేక అధికారులను కేటాయించారు. ఇందులో భాగంగా దండేపల్లి పీహెచ్సీకి జాదవ్ ప్రకాశ్ (ఈఈపీఆర్) ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. పీహెచ్సీని సందర్శించిన అనంతరం స్థానిక వైద్యులతో ఆయన మాట్లాడి పలు సలహాలు, సూచనలు చేశారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, వైద్యాధికారులు సునీల్, అరుణ, సూపర్వైజర్లు లక్ష్మణ్, పుష్పలత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జన్నారంలో..
జన్నారం, మే 24 : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మండల ప్రత్యేక అధికారి శంకర్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ ప్రత్యేకాధికారికి తెలిపారు. డాక్టర్ సునీత, ఎంపీడీవో అరుణారాణి, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, మండల కో ఆప్షన్ సభ్యుడు మున్వర్అలీఖాన్ ఉన్నారు.
వేమనపల్లిలో..
వేమనపల్లి, మే 24 : వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా పంచాయతీ అధికారి, ఆరోగ్య కేంద్రం ప్రత్యేకాధికారి నారాయణరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని రికార్డుల ను పరిశీలించారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ, సర్పంచ్ కుబిడె మధుకర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ ఉన్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి..
మందమర్రి మే 24 : కరోనా బాదితులకు మెరుగైన వైద్య సేవలందించాలని చీఫ్ ప్లానింగ్ అధికారి కిష్టయ్య వైద్య సిబ్బందికి సూచించారు. మందమర్రి పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో గల ప్రభు త్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంతో పాటు దీపక్నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఆయా దవాఖానల్లో మౌలిక వసతులు, కొవిడ్ పరీక్షల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. దవాఖానల్లో కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారులు శైలజ, శివప్రతాప్ను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ పరీక్షలు, చికిత్స అందిస్తున్న దవాఖానను ప్రతిరోజూ శానిటైజ్ చేయాలని వైద్యులకు, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజుకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో సబ్జర్ అలీ, హెల్త్ సూపర్ వైజర్ శ్రీనివాస్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్లో..
చెన్నూర్ రూరల్, మే 24: రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని మండల ప్రత్యేక అధికారి డీ కృష్ణ అన్నారు. మండలంలోని కిష్టంపేట గ్రామపంచాయతీ ఎల్లక పేటలోని ప్రభుత్వ దవాఖానను సోమవారం ఆయన పరిశీలించారు. వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట దావఖాన సూపరింటెండెంట్ సత్యనారాయణ ఉన్నారు.