ఆసిఫాబాద్లో 850, బెల్లంపల్లిలో 850, మంచిర్యాలలో 2323 మంది హాజరు
ఆసిఫాబాద్,జూలై17: జిల్లాకేంద్రంలోని ఐదు కేంద్రాల్లో శనివారం జరిగిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. 936 మంది విద్యార్థులకు 850 మంది హాజరైనట్లు జిల్లా కో ఆర్డినేటర్ , డీఐఈవో శ్రీధర్ సుమన్ తెలిపారు. సెట్ ప్రత్యేక పరిశీలకుడిగా యాదయ్య వ్యవహరించారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ రాజేశం తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల నుంచే విద్యార్థులకు శానిటైజర్ అందజేసి, థర్మల్ స్క్రీనింగ్ చేసి హాల్లోకి అనుమతించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఇద్దరుచొప్పున వైద్య సిబ్బంది, పోలీస్లు విధులు నిర్వహించారు. రూల్ అధికారి ఆత్మారాం, పరీక్షా కేంద్రాల పరిశీలకులు శంకర్, సురేశ్, నాగరాజు, రాజు, శ్రీను ఉన్నారు.
2323 మంది హజరు..
సీసీసీ నస్పూర్, జులై 17: జిల్లాలో పాలిసెట్ ప్రశాంతంగా ముగిసిందని మంచిర్యాల జిల్లా పాలిసెట్ కోఆర్డినేటర్, సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం మంచిర్యాల, సీసీసీ నస్పూర్లోని 11 కేంద్రాల్లో 2485 మంది విద్యార్థులకు 2323 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు సహకరించిన శ్రీరాంపూర్ జీఎం సురేశ్, ఎస్బీటీఈటీ ప్రత్యేక అబ్జర్వర్ దేవేందర్, ఎంఈవో పోచయ్య, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీస్, విద్య, ఆరోగ్య, విద్యుత్, రెవెన్యూ శాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
1263 మంది హాజరు..
బెల్లంపల్లిటౌన్, జూలై 17 : పట్టణంలోని ఆరు కేంద్రాల్లో మొత్తం 1359 విద్యార్థులకు 1263 మంది హాజరయ్యారు. పరీక్ష సమయం 11 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అధికారులకు అనుమతించలేదు.