బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషిచేయాలని ఖమ్మంజిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. మంగళవారం బోనకల్లు సహకార సంఘం అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ పార్టీ నిర్మాణం కోసం నడిపించే నాయకుడు ఎంతో అణుకువతో వ్యవహరించాలని, ఇప్పటి వరకు మూడు పర్యాయాలు మండల అధ్యక్షుడిగా బంధం శ్రీనివాసరావు నాయకత్వంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ అభివృద్ధికి దోహదపడ్డారన్నారు.
అక్టోబర్3న అతిపెద్ద బహిరంగసభ మధిరలో జరుగుతుందన్నారు. ఈ సభలో బోనకల్లు మండలం నుంచి పార్టీ నియమించిన కమిటీ సభ్యులతో పాటు, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ, మధిరలో ఎంపికైనమొత్తం1500 మందితో ప్రమాణస్వీకారం చేయించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మాజీమండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మండల రైతుకన్వీనర్ వేమూరి ప్రసాద్, మాజీజడ్పీటీసీ బాణోతు కొండ, జిల్లా రజకసంఘం అధ్యక్షులు తమ్మారపు బ్రహ్మయ్య, ఎస్సీసెల్ నాయకులు గద్దల వెంకటేశ్వర్లు, సర్పంచ్లు జెర్రిపోతుల రవీందర్, చిలకా వెంకటేశ్వర్లు, కొమ్మినేని ఉపేందర్, భుక్యా సైదానాయక్, ఎంపీటీసీలు హైమావతి, నాయకులు కరివేద సుధాకర్రావు, తన్నీరు రవి, కొనకంచి నాగరాజు, షేక్ జానీ, తదితరులు పాల్గొన్నారు.