ఖమ్మం: స్ధానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా ఉంటాయని, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. బుధవారం ఖమ్మంలో జడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పిటిసిలతో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 70శాతం పైగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాతా మధుసూదన్, భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.