బోనకల్లు : మండలంలోని జానకీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలను, పాఠశాల ఆవరణాన్ని, ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిష్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలకు హాజరుకావాలన్నారు. విద్యార్థులు ఎటువంటి భయాందోళనకు గురికావొద్దన్నారు. ఇంకా పాఠశాలకు రానివారిని పాఠశాలకు రప్పించాలని సూచించారు.
ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ పాఠశాలలో ఉన్నాయా ..?లేవా.. ? అని అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా ధర్మామీటర్, మాస్క్లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జీ.శ్రీదేవి, సర్పంచ్ చిలకా వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, వేమూరి ప్రసాద్, తోటకూర అనంతరాములు, తదితరులు పాల్గొన్నారు.