కల్లూరు, డిసెంబర్ 25 : ప్రతిరోజూ చేస్తున్న పనులను ఫోటోలతో సహా పంపించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జడ్పీ సీఈవో అప్పారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
కార్యాలయంలో రికార్డులు పరిశీలించి హాజరు రిజిస్టర్, ఇంటి పన్నులు, పంచాయతీ నిర్వహణ వివరాలు, పారిశుధ్య వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి విధుల పట్ల అలసత్వంవహిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.