కారేపల్లి,(కామేపల్లి) ఏప్రిల్ 23 : ట్రాక్టర్, బైక్ను ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన గురువారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పాత లింగాల స్టేజి వద్ద చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండల పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన వేముల భాగ్యలక్ష్మి(33) ఆమె భర్త వేముల గోవిందరాజులు బైక్ పై మాదారం నుండి ఖమ్మం వెళ్తున్నారు.ఈ క్రమంలో ఇల్లెందు ఖమ్మం ప్రధాన రహదారి పాత లింగాల స్టేజి వద్ద వారు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది.బైక్ పై వెనుక కూర్చున్న భాగ్యలక్ష్మి ట్రాక్టర్ డీ కొనడంతో కింద పడిపోయింది.దీంతో ట్రాక్టర్ టైర్ ఆమె తలపై ఎక్కడంతో మెదడు రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోయింది.
పాత లింగాల చెరువు నుండి జాస్తిపల్లి వైపు మట్టి తోలకాలు జరుపుతున్న ట్రాక్టర్ డ్రైవర్ పాత లింగాల స్టేజి వద్ద రోడ్డు దాటే క్రమంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్లే మోటార్ సైకిల్ ని ఢీ కొట్టి మహిళా మృతికి కారణమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.సమాచారం అందుకున్న కామేపల్లి పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఋతురాలి కుటుంబానికి డాక్టర్ యజమాని న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు,బంధువులు, మాదారం గ్రామ పెద్దలు డిమాండ్ చేశారు.న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించమని సంఘటన స్థలంలోనే భీష్మంచి కూర్చున్నారు.ఈ విషయమై ఇరువైపులా చర్చలు కొనసాగుతున్నాయి.