సత్తుపల్లి టౌన్, నవంబర్ 27 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగానికి పెద్దపీట వేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం సత్తుపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని సీఎం కేసీఆర్ సులభతరం చేశారని పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి కింద నియోజకవర్గంలో 622 మందికి రూ.2,97,74,275 విలువైన చెక్కులు మంజూరయ్యాయని, ఇంటింటికీ తిరిగి రేపటి నుంచి వాటిని లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 3,100 మందికి రూ.17 కోట్లకు పైగా చెక్కులు అందజేసినట్లు తెలిపారు. ఏ ప్రభుత్వం కూడా ఇలా ఆర్థికసాయం చేసి ఆదుకున్న దాఖలాలు లేవన్నారు.
రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి తెలియని వాళ్లు లేరని, దేశంలో కేసీఆర్ ప్రభుత్వానికి మించిన ప్రభుత్వం మరేదీ ఉండదన్నారు. కులం, మతం లేకుండా షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల కంటే సత్తుపల్లి నియోజకవర్గానికి ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చేలా చూశామని, సత్తుపల్లి మండలంలో రోడ్లు లేకుండా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్లు వేయించినట్లు ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు.
కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నానని, భూ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, తుమ్మూరు సొసైటీ అధ్యక్షుడు చిలుకుర్తి కృష్ణమూర్తి, వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, కౌన్సిలర్లు అనిల్, చాంద్పాషా, రఘు, మందపాటి రవీందర్రెడ్డి, కంటే నాగలక్ష్మి పాల్గొన్నారు.