కల్లూరు, ఆగస్టు 2: తెలంగాణలోనే వీఆర్ఏలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. వీఆర్ఏలను అక్కున చేర్చుకున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. విద్యార్హతలను బట్టి వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించడం, పే స్కేల్ వర్తింపజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కల్లూరు ఏఎంసీ ఆవరణలో నియోజకవర్గ వీఆర్ఏల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బుధవారం క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 23 వేల మందికి పైగా ఉన్న వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాడానని, అసెంబ్లీలో అధికార పక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే పాత్రను పోషిస్తూ వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, వాటి పరిష్కారానికి కృషిచేశానని అన్నారు. ఎన్నికల కోసమో, రాజకీయం కోసమో కాకుండా వీఆర్ఏల భవిష్యత్తు కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. 150 మంది వీఆర్ఏలతోపాటు వీఆర్ఏల జేఏసీ నాయకులు అజీజ్, వీరబాబు, మీర్జానిషరీఫ్, మౌనిక, ఇతర నాయకులు కట్టా అజయ్కుమార్, లక్కినేని రఘు, కనగాల వెంకట్రావు, లక్కినేని అలేఖ్య, ఇస్మాయిల్, బోబోలు లక్ష్మణరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, పెడకంటి రామకృష్ణ, షేక్ కమిలీ తదితరులు పాల్గొన్నారు.