మధిరరూరల్, మార్చి 27 : ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు వచ్చే ఓటర్లకు ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మహదేవపురం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ బూత్లో ఫ్యాన్లు, లైటింగ్, తాగునీటి సౌకర్యం ఉండే విధంగా చూడాలని సూచించారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసే విధంగా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో శాస్త్రి తదితరులు ఉన్నారు.