ఖమ్మం, డిసెంబర్ 9: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎంపీలు కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఢిల్లీలో సోమవారం కలిసి వినతులు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేశ్రెడ్డి, ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు దామోదర్రావు మాట్లాడారు.
భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుంచి హైదరాబాద్కు కొవిడ్ సమయంలో రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని, అదనంగా మరికొన్ని రైళ్లను నడపాలని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి ప్రత్యేక రైలు నడపాలని కోరారు. అలాగే, గాంధీపురం రైల్వేస్టేషన్లో ప్లాట్ఫాం ఎత్తు పెంచాలని, ఆధునీకరణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
కారేపల్లి స్టేషన్ను అభివృద్ధి చేయాలని, గతంలో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ను పునరుద్ధరించాలని కోరారు. ఖమ్మం స్టేషన్లో బీహార్, జైపూర్ వెళ్లే రైళ్లను ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా మరికొన్ని సమస్యలను రైల్వేమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి.. ఆయా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, వాటి పరిషారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.