ఖమ్మం: జిల్లాలోని కొణిజెర్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కొణిజెర్ల సమీపంలో ఓ బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్నవారు కిందపడటంతో వారిపైనుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులు పల్లిపాడుకు చెందిన వెంకన్న, అతని సోదరి లక్ష్మిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..