పినపాక, సెప్టెంబర్ 11 : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే టీఆర్ఎస్ పా ర్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఈ-బయ్యారం అడ్డరోడ్డులోని ఫంక్షన్హాల్లో నిర్వహించిన భద్రాద్రి థర్మల్ పవర్ప్లాంట్ భూ నిర్వాసిత ఉద్యోగుల విజయోత్సవ సభకు ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో 346 మందికి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉద్యోగాలిచ్చిన ఘనత టీఆర్ఎస్దేనని అన్నారు.
భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఉద్యోగాలు సాధించిన వారు నిబద్ధతతో పనిచేసి సంస్థకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. 400 మంది ఉద్యోగులకు కాలనీల నిర్మాణం చేపడుతున్నామని రెం డు, మూడు రోజుల్లో టెండర్లను పిలుస్తామని తెలిపారు. ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పవర్ప్లాంట్ ఉద్యోగులు పాల్గొన్నారు.