బోనకల్లు : మండలంలోని టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలైన నూతన కమిటీలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు సమక్షంలో ప్రకటించారు. మహిళా సంఘం అధ్యక్షురాలిగా బీ.సిలార్బీ, ప్రధాన కార్యదర్శిగా బోయినపల్లి వెంకటరాజ్యం, రైతుసంఘం మండల అధ్యక్షుడిగా కాకాని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా గుడిపుడి రామకృష్ణ, మైనార్టీ సంఘం అధ్యక్షుడిగా షేక్ ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శిగా షేక్ పాషా, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా వెంగళ కనకయ్య, ప్రధాన కార్యదర్శి డేగల బాబు, బీసీసెల్ అధ్యక్షుడిగా మోర్ల మహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా దొప్పా ప్రసాద్, ఎస్టీసెల్ అధ్యక్షుడిగా ముడావత్ సైదా, ప్రధాన కార్యదర్శిగా భుక్యా స్వామి ఎంపికయ్యారు.
కార్మిక శాఖ అధ్యక్షుడిగా బంధం నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా నోముల వెంకటేశ్వర్లు, సోషల్మీడియా అధ్యక్షుడిగా పిల్లెం దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా షేక్ సద్దాంలతో పాటు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులుగా గాదే నర్వోత్తమరెడ్డి, ఇటికాల శ్రీనివాసరావు, పారా ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా తన్నీరు పుల్లారావు, చావా హనుమంతరావు, యనిగండ్ల మురళీ, సంయుక్త కార్యదర్శులుగా ఉయ్యూరి రాధాకృష్ణ, షేక్ మదార్సాహేబ్, దిద్దిబోయిన నాగయ్య, ప్రచార కార్యదర్శులుగా షేక్ హుస్సేన్, సాదినేని శ్రీనివాసరావు, పెనుగొండ ఏడుకొండలు, కోశాధికారిగా గద్దల వెంకటేశ్వర్లుతో పాటు, మరో 9 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేస్తూ నియామకపత్రాలను అందజేశారు.