సత్తుపల్లి : టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణ కమిటీ సమావేశం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కె.రఫీ, మల్లూరి అంకమరాజుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెదిలే ఆలోచనలను పథకాలుగా రూపొందించి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఏ సంక్షేమ పథకం ఆగకుండా ప్రతి ఇంట్లో సంక్షేమ పథకానికి సంబంధించిన ఫలాలు అందేలా ప్రణాళికలు రూపొందించి వాటిని అమలుచేశారన్నారు.
ఈ సమావేశంలో కాలినేని సాయిరామ్, మౌలాలి, కోనేరు నాని, బెల్లంకొండ రాము, పంతంగి సాంబశివరావు, మందపాటి శ్రీనివాసరావు, కిలారు, దాసరి వెంకటేశ్వరరెడ్డి, మాధురి మధు, షౌకత్, ముజాఫర్ తదితరులు పాల్గొన్నారు.