ఏన్కూరు: మండలంలోని పైనంపల్లితండాకు చెందిన గిరిజన విద్యార్థి బాణోతు మోహన్ తెలంగాణ అండర్ఆర్మ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి సూరత్లో నిర్వహించే జాతీయస్థాయి క్రికెట్లో అండర్-19 బాలురు జట్టుకు ఎంపికయ్యాడు.ఈ నెల2,3 తేదీల్లో సత్తుపల్లిలో జరిగిన సెలక్షన్లో ఎంపికయ్యాడు. మోహన్ ఖమ్మం గీతాంజలి కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ సందర్భంగా సర్పంచ్ ధరావత్ హరిసింగ్, గ్రామస్తులు మోహన్ను అభినందించారు. భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో మంచి పేరుప్రఖ్యాతులు తేవాలని ఆశీర్వదించారు.