కారేపల్లి, ఏప్రిల్ 27 : రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగను ఖమ్మం సిసిఎస్, కారేపల్లి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించినట్లు కారేపల్లి ఎస్ఐ గోపి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వివరాలు వెల్లడించారు. ఖమ్మం ఖిల్లా బజార్ చెందిన ఎండీ.మతిన్ ఆరు కేసుల్లో ప్రధాన నిందుతుడని, కారేపల్లి పోలీస్ స్టేషన్ లో మూడు చోరి కేసులు నమోదు కాగా మధిర, బోనకల్, పెద్దపల్లి జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైనట్లు తెలిపారు. ఆయా కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని కారేపల్లి ఆటో స్టాండ్ వద్ద దొంగను గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి నుండి నుంచి సుమారు మూడు తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.